Bandi Sanjay: సొమ్ము కేంద్రానిదైతే.. సోకు మీరు చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా?
Bandi Sanjay Fires On BRS Government Over ROB: కరీంనగర్ పార్లమెంట్ నియోజకర్గ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణం కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అని.. ఇన్నేళ్లకైనా ఈ పనులకు శంకుస్థాపన చేయాలనుకోవడం స్వాగతించదగ్గ పరిణామమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఆర్వోబీ మంజూరు తమ ఘనతేనంటూ నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. గత 8 ఏళ్లుగా పనులెందుకు చేపట్టలేదు? అని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ వ్యయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నయాపైసా కూడా కేటాయించకుండా ఇచ్చిన మాట తప్పిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు ఇదంతా తమ ఘనతేనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.
MLA Sridhar Babu: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై.. కాంగ్రెస్పై కక్ష సాధింపు చర్యలు చేపడతున్నాయి
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు
- Karimnagar: కరీంనగర్ RBL బ్యాంకులో 138 కోట్ల మోసం బట్టబయలు.. వెలుగులోకి కీలక విషయాలు..
- Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!
ఈ ఆర్వోబీ నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం మొదటి నుండి సానుకూలత వ్యక్తం చేస్తూ వస్తోందని.. తొలుత చేసుకున్న ఒప్పందం ప్రకారం 80 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం వాటా కేంద్రం చెల్లించేందుకు అంగీకరించిందని బండి సంజయ్ వివరించారు. నిధులు విడుదల చేయాలని తాను చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, లేఖలు రాసినా.. ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఇదిగో అదిగో అంటూ జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కాలం వెళ్లదీస్తూ వచ్చిందే తప్ప, నయాపైసా కూడా విడుదల చేయలేదన్నారు. చివరికి నిధులు విడుదల చేయమని చేతులు ఎత్తేయడంతో.. తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఆర్వోబీ నిర్మాణ వ్యయం మొత్తం 126 కోట్ల 74 లక్షల రూపాయలను కేంద్రమే భరించేలా ఒప్పించానని చెప్పారు. ఇందుకు 8 నెలల క్రితమే కేంద్రం ఆమోదం తెలిపినా, ఇప్పటిదాకా ఎందుకు పనులు ప్రారంభించలేకపోయారు? అని నిలదీశారు.
Heavy Rains: ఉత్తరాదిలో భారీ వర్షాలు.. హోంమంత్రి ఇంట్లోకి వరద నీరు..
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని.. సకాలంలో ఈ పనులు ప్రారంభించి, నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే ఆ ప్రాణం బలయ్యేది కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే.. ఇన్నాళ్లూ జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం వల్లే జాప్యం అయ్యిందంటూ నిందలేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్బోబీ కోసం తానెంతో కృషి చేశానని, అయితే తనకు సమాచారం ఇవ్వకుండా దీనికి శంకుస్థాపన చేస్తుండటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. ప్రతీది తమ ఘనతేనంటూ చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. వరంగల్-కరీంనగర్, ఎల్కతుర్తి-సిద్దిపేట, కరీంనగర్-జగిత్యాల రహదారి విస్తరణ పనుల కోసం 8 ఏళ్లుగా నిధులెందుకు సాధించలేకపోయారో సమాధానం చెప్పాలని అడిగారు. కరీంనగర్ ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని, తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!