MP K.Laxman : ఇది ముమ్మాటికి ఆదివాసీ మహిళలను అవమానించడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్కు బీఆర్ఎస్ నేతలకు మహిళలను అవమానించడం అలవాటుగా మారిందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వంతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంటులో ప్రసంగిస్తే… దానిని బైకాట్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ఆదివాసీ మహిళలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవిని అలంకరిస్తే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ ఇలా వ్యవహారించిందన్నారు. అంతేకాకుండా.. ‘ బీఆర్ఎస్ కు మహిళలంటేనే చిన్నచూపు… వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా వారిని అవమానించడమే పనిగా పెట్టుకుంది.. మహిళ అయిన తెలంగాణ గవర్నర్ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు రాష్ట్రపతిని అవమానించారు.
Also Read : Shakuntalam: సమంత శాకుంతలం వాయిదా..?
Also Read
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
- Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
గవర్నర్ విషయంలో తాజాగా కేసీఆర్ సర్కార్ మరోసారి కోర్టు చివాట్లు తిన్నడు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నడిపించాలనీ చూశారు. కోర్టు చెంప చెళ్లుమనిపించడంతో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానిస్తున్నామంటున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక పండుగ వాతావరణంతో జరుపుకోవాలని. అలాంటిది ఏమి చేయకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించారు. రాష్ట్రపతి ప్రసంగం చాలా బాగుంది.. రాష్ట్రపతి ప్రసంగంలో నూట నలభై కోట్ల జనాభా ప్రజల అభివృద్ధి చూడవచ్చు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాంటి విషయాల్లో కూడా భారత ప్రభుత్వం. ఆదివాసి ప్రాంతాలు ఆదివాసి పాఠశాలలు ఏర్పాటు చేశాము.
ఆత్మనిర్బర్ భారత్ గా ఆవిర్భవిస్తోందన్నారు… 140 కోట్ల భారతీయుల అభివృద్దే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకే గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వంలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగింది. వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గా నిలుస్తుంది.. మోదీ పాలనలో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.. యావత్ ప్రపంచం భారతదేశం పట్ల ఆశావహ దృక్పథంతో చూస్తోంది… ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైంది. పేదలు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు. ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటోంది. ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చింది.’ లక్ష్మణ్ అన్నారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!