ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్లతో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలు.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఒమిక్రాన్ను అడ్డుకునేందుకు ఇప్పటికే వివిధ దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా ఒమిక్రాన్పై దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భారత్లో కూడా తాజాగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరు కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్పోర్టులో నవంబర్ 11న ఒకరు,…
తవ్వకాల్లో బయటపడిన వస్తువులపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అలాగే అవి ఎక్కడ బయటపడ్డాయని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే తాజాగా పురాతన నాణేలతో నిండిన కుండ ఒకటి బయట పడింది. ఎక్కడంటే మధ్య ప్రదేశ్లోని టికామ్ఘర్ జిల్లాలో. అయితే టికామ్ఘర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గల నందన్వారా గ్రామంలోని మట్టి క్వారీలో మంగళవారం ఉదయం జేసీబీతో మట్టిని తవ్వుతున్న సమయంలో ఒక కుండ కార్మికులకు కనిపించింది. దీంతో కార్మికులు ఆ కుండను బయటకు తీశారు. అందులో…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో తుఫాన్ ఏపీపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. గత నెల 29న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇప్పుడు వాయుగుండంగా బలపడి ఎల్లుండి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, ఒడిశాలో 4న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ…
నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ ఘటనపై నందమూరి కుటుంబ సభ్యులు సైతం భువనేశ్వరికి అండగా నిలబడ్డారు. అయితే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నారా లోకేష్, ఆయన బృందం నాతో నా కుటుంబంపై చేసిన కామెంట్లకు ఎమోషన్లగా ఒక మాట అనబోయి మరో మాట అన్నానన్నారు. అయితే ఈ విషయంలో తాను…
నీతి ఆయోగ్ ముందు ఏపీ ప్రభుత్వం సమస్యల చిట్టా పెట్టింది. రాష్ట్ర విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నీతి ఆయోగ్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. తీవ్ర రుణభారంతో ఉన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలను గాడిలో పెట్టడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర విభజన అనంతర పర్యవసనాల కారణంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను, హైదరాబాద్ను కోల్పోవడంతో పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడిందని గణాంకాలతో సహా నీతి ఆయోగ్ దృష్టికి…
రేపటి నుండి ఈ నెల 8 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన చర్ల మండలం చెన్నాపురంలో పర్యటించిన అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపెందుకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మావోయిస్టుల వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలని, సరిహద్దు…
తెలంగాణలో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులో ఉండనుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 2019-2021 మద్యం షాపుల లైసెన్స్ ముగియడంతో కొత్త మద్యం దుకాణాలకు తెలంగాణ సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లకు దరఖాస్తు చేసుకునే వారికి రూ.2లక్షల రుసుము విధించింది. ఈ నేపథ్యంలో 2,620 మద్యం దుకాణాలకు గాను 48 మినహా మిగతా దుకాణాలకు లైసెన్స్ లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు…
బుర్రకో బుద్ది, జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఈ సమాజంలో ఓ వస్తువును ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతుంటారు. కొందరు మరింత వైవిధ్యంగా ఆలోచించి చేసే పనులు పలు సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే అలాంటిదే ఈ వీడియో.. మామూలుగా మనం ప్రెషర్ కుక్కర్ను వంటకు ఉపయోగిస్తుంటాం. కానీ.. ఓ యువకుడు వెరైటీగా ఆలోచించి ప్రెషర్ కుక్కర్ నుంచి వచ్చే ఆవిరిని ఉపయోగించి తన జట్టును ఆరబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయలేక డ్రామాలు ఆడుతోందని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలు సైతం ధాన్యం కొనుగోళ్లు చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ వరి దీక్షలకు కూడా దిగారు. తాజాగా మాజీ పీసీసీ ఉత్తమ్కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.…
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న కన్నుమూసిన విషయం తెలిసింది. గత నెల 24న న్యుమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఆయన నిన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే సిరివెన్నెల…