తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24 అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఆయనను నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వైద్యులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. Also Read :…
కరోనా మహమ్మరి దేశంలో ఇంకా ప్రబలుతూనే ఉంది. కొన్ని చోట్ల తగ్గుముఖం పట్టినా కరోనా వైరస్ మరికొన్ని చోట్ల విజృంభిస్తోంది. అయితే ఇండియా ఫస్ట్, సెకండ్ వేవ్లతో అతలాకుతలమైంది. అయితే థర్డ్ వేవ్కు భారతదేశంలో అస్కారం లేకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు విధించాయి. గత నెల కేంద్రం పొడగించిన కోవిడ్ నిబంధనలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేంద్రం కోవిడ్ నిబంధనలను డిసెంబర్ 31వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే…
ప్రపంచ దేశాల గడగడలాడించిన కరోనా వైరస్ మరో రూపం ఎత్తి భయాందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై పలు దేశాలు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్ తోనే అవస్థలు పడిన తెలంగాణ ప్రజలు ఇప్పడు మరో వేరియంట్ వ్యాప్తి చెందుతోంది అనే సరికి భయం మొదలైంది. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. విదేశాల నుంచి 41 మంది…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో కూడా మునుపెన్నడూ చూడనటువంటి వరదలు తలెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటికే ఆరా తీసిన సీఎం జగన్ ఈనెల 2న స్వయంగా తానే జనం దగ్గరకు వెళ్లనున్నారు. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పటికే పంట, ప్రాణ నష్టం పై వివరాలను జగన్ తీసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 700 మందిని పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ హయాంలో అన్నపురాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపుగా పరిస్థితి ఉందని ఆయన…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్రెడ్డి, శంకర్రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు. అంతేకాకుండా నాకు, నా…
నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం నుంచి గందరగోళ వాతావరణంలోనే సాగింది. విపక్షాల వ్యతిరేక నినాదాలతో విసుగు చెందిన రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ.. సభను రేపటి వాయిదా వేశారు. అనంతరం పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్కు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నానని, కానీ ఈ రకమైన వాతావరణాన్ని చూడటం ఇదే మొదటిసారని ఆమె అభిప్రాయం వ్యక్తం…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం –…
ఏపీ రాజకీయాను ఒక్కసారిగా భగ్గుమనిపించిన అసెంబ్లీ ఘటనపై స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసునని ఆయన వెల్లడించారు. పత్రిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సభలో రికార్డులను కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని ఆయన హితవు పలికారు. సభను పక్కదారి పట్టించేందుకు తన…
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండెనొప్పితో ఓ వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ దగ్గరకు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ లక్ష్మణ్ పేషెంట్కు చికిత్స చేస్తుండగా ఉన్నట్టుండి డాక్టర్ లక్ష్మణ్ కూడా గుండెపోటు వచ్చింది. దీంతో డాక్టర్ లక్ష్మణ్తో పాటు, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.