తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజమాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. భీంగల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలో మంచి పేరు తెలంగాణ తెచ్చుకుందని, ఇవన్నీ పక్కన పెట్టి కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని…
వివాదాస్పద షియా ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల దాస్నా ఆలయంలో ఇస్లాం మతం వీడి హిందు మతం స్వీకరించారు. ఆలయ పూజారి యతి నర్సింహానంద సరస్వతి ఆచారాలను నిర్వహించి వసీం రిజ్వీని హిందు మతంలోకి మార్చారు. అయితే అనంతర రిజ్వీ పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చినట్లు తెలిపారు. త్యాగిగా పేరు మార్చుకున్న రిజ్వీ మాట్లాడుతూ.. ఏ మతాన్ని అనుసరించాలనేది తన ఇష్టమని, కాబట్టి ప్రపంచంలోని…
టీడీపీ నేత పట్టాభిరామ్ మరోసారి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు. ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి…
డా. బీఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని మా నాయకుడు ఎన్టీఆర్ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆంశాలు భారతదేశానికే కాకుండా చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంబేద్కర్ దేశశిల్పి అంటూ కొనియాడారు. అంతేకాకుండా రాజ్యాంగం ఎంతమంచిదైనప్పటికీ పాలించేవారు మంచివారు కాకపోత చివరికి రాజ్యాంగం కూడా తప్పుగా…
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు త్వరలో నగరంలోని ప్రధాన ప్రదేశాలలో వక్ఫ్ ఆస్తుల అభివృద్ధిని చేపట్టేందుకు తన ప్రణాళికలను ఖరారు చేయనుంది. ప్రైవేట్ సంస్థల సహకారంతో బోర్డు దాని స్థలాల ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించడానికి షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్, ఇతర వాణిజ్య స్థలాల నిర్మాణాన్ని చేపట్టనుంది. దీని ద్వారా వచ్చే ఆదాయంతో మైనార్టీల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతామన్నారు. గతంలో దీనిపై ప్రణాళికలను సిద్ధం చేశామని, రానున్న బోర్డు సమావేశంలో మమ్మల్ని సంప్రదించిన కంపెనీలను…
శీతాకాల పార్లమెంటు సమావేశాలు గత నెల 29 ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. అయితే లోక్సభ 6వ రోజు సమావేశాలు ప్రారంభం నుంచే విపక్షాలు నాగాలాండ్ ఘటనపై చర్చించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో మరోసారి లోకసభ వేడెక్కింది. విపక్షాల నినాదాలకు స్పందిస్తూ నాగాలాండ్ ఘటనపై హోంమత్రి ప్రకటన చేస్తారని కేంద్రం వెల్లడించింది. నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 17 చేరింది. ఇదిలా ఉంటే…
నవంబర్ 28, 2019న రాత్రి ఒక వెటర్నటీ డాక్టర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశారో నలుగురు దుండగులు. దిశ పేరుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఒక్కరోజులోనే పట్టుకొని విచారణ చేపట్టారు. అయితే 2019 డిసెంబర్ 6న దిశ కేసులో సీన్ రీ కన్స్ట్రాక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు.…
కరోనా మహమ్మారి విజృంభన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి మొదలైంది. ఇప్పటికే 38 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ కొత్త నివేదికల ప్రకారం ఇప్పుడు 46 దేశాలకు పాకింది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 941కి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య చేరింది. యూకేలో 246 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, దక్షిణాఫ్రికాలో…
కరోనా వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న గందరోగోళం అంతాఇంతా కాదు. కొత్త కొత్త వేరియంట్లతో కరోనా రూపాలు మార్చుకొని ప్రజలపై దాడి చేస్తోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో బయటపడ్డ మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం ఇప్పటికే పలు దేశాలపై దండయాత్రను మొదలు పెట్టింది. అంతేకాకుండా ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి కూడా ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భారత్కు థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీ ఫ్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కరోనా…
ప్రముఖ పారిశ్రామికవేత్తలను మోసం చేసి వారి వద్ద నుంచి 200 కోట్లు మనీలాండరింగ్కు పాల్పడిన సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయంతో తెలిసింది. అయితే బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లకు సుఖేశ్ చంద్రశేఖర్ కోట్లు విలువైన చేసే బహుమతులు ఇచ్చినట్లు ఈడీ చార్జ్షీట్లో పొందుపరిచింది. జాక్వెలిన్కు రూ.52 లక్షలు విలువ చేసే గుర్రంతో పాటు రూ. 9లక్షలు విలువ చేసే పిల్లినే కాకుండా మొత్తంగా రూ.10 కోట్ల విలువైన బహుమతులు సుఖేశ్…