భారీవర్షాలతో ఏపీలో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతిలో సైతం మునపెన్నడూ చూడనివిధంగా వరదలు పోటెత్తాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల సీఎం జగన్ పర్యటించారు. అంతేకాకుండా బాధితులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు మాటలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. భారీ వర్షాలతో సంభవించిన వరదలను మానవ తప్పిదంగా చూపించాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, అందుకే…
నేటి సమాజంలో ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. అలాగే మోసాలు కూడా పెరిగిపోయాయి. చిన్న, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ ఉండే ఆశ సొంతిల్లు. అయితే ఎంతో కష్టపడి డబ్బుదాచుకొని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మరీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీవి అని తెలిస్తే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి సంఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. మల్లంపేట్ సర్వే నంబర్ 170/3, 170/4,…
హైదరాబాద్లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. నిందితులను అరెస్టుచేసి విచారణ చేస్తుండగా వెల్లడించిన విషయాలతో పోలీసులు అవాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హరియానాకు చెందిన ఓ గ్యాంగ్ ఎస్బీఐ ఏటీఏంలనే టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 27 మంది బంధువులకు సంబంధించి ఫేక్ అకౌంట్స్ సృష్టించిన ఈ గ్యాంగ్.. ఏటీఎంలో డబ్బులు డ్రాచేస్తున్నప్పుడు డబ్బులు వచ్చే సమయానికి పెన్, స్టిక్ అడ్డుపెట్టి సాంకేతిక సమస్యలు సృష్టించేవారు.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డిలు రోశయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య మృతి చెందడం చాలా బాధకరమని, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో.. ఎక్కడా మచ్చ తెచ్చుకోలేదు ఆయన అన్నారు. ఆర్థిక సమస్యలపై ఎంతో పట్టు…
యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి మరోసారి రూపాంతరం చెంది విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి కొలుకుంటున్న దేశాలు, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరువినగానే భయాందోళనకు గురవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే పలు దేశాలలో వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా 719 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు డబ్లూహెచ్వో వెల్లడించింది. ఈ వేరియంట్ ఇటీవలే ఇండియాలోకి…
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొయ్యూరు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, ఎడ్ల, గొర్ల, బర్ల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ…
హాలీవుడ్ సినిమాల బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకే ఆ సినిమాల్లో వాడే గ్రాఫిక్స్ అంతా న్యాచురల్గా కనిపిస్తుంటాయి కూడా. అయితే తాజాగా హెచ్బీవో ఒరిజినల్స్ కోసం భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్- స్పిన్ఆఫ్’ పైలట్ ఎపిసోడ్ను రద్దు చేసింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ బాహుబలి ది బిగినింగ్ సినిమా కంటే ఈ ఎపిసోడ్ చిత్రీకరణకు హెచ్బీవో ఎక్కువ ఖర్చుచేసింది. బాహుబలి మొదటి పార్ట్కు 28 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగా, ‘గేమ్ ఆఫ్…
అండమాన్ లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్గా మారింది. అయితే ఈ తుఫాన్ పేరు జవాద్ తుఫాన్గా నామకరణం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలపై ఈ జవాద్ తుఫాన్ ప్రభావం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు…
రోజూ నాలుగు షోలకు మించకూడదు, బెని ఫిట్ షోస్ అసలు వేయకూడదని ఏపీ సర్కార్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను రెండు సినిమా థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. దీంతో అధికారులు ఆ థియేటర్లను సీజ్ చేశారు. చట్ట సవరణ తర్వాత నిబంధనలు ఉల్లంఘించి థియేటర్స్ పై మొదటిసారి సర్కార్ యాక్షన్ తీసుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర మిని ధియేటర్ అఖండ సినిమా ఉదయం…
ప్రపంచ దేశాలతోపాటు అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడించింది కరోనా మహమ్మారి. కరోనా ధాటికి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా సోకి ఇంటి పెద్దలు మృతి చెందడంతో చాలా మంది చిన్నారులు అనాథలు మారారు. కరోనా రూపాంతరం చెంది డెల్టా వేరియంట్గా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కునేందుకు ఎంతో శ్రమించి శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్లను కనుగొన్నారు. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.…