ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ యువకుడి నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని వలన వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించడం లేదని కొంతకాలంగా ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు సుందర్ తో పాటు కుటుంబం నిరసనలు వ్యక్తి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని న్యాయం కోసం ప్రధానిని కలిసేందుకు సుందర్ కుమారుడు సంజయ్ ఆరు రోజులు బైక్ పై ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నాడు.
గతంలో ఎడ్లబండి మీద ఖమ్మం జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెళ్లడంతో పాటు సింగరేణి సంస్థ తీరును నిరసిస్తూ సుందర్ కుటుంబం 5 సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందరికీ విన్నవించినా తమకు న్యాయం జరగడం లేదని ఇటీవల ఇల్లందులో సెల్ టవర్ సైతం సుందర్ ఎక్కాడు. 10 గంటల పాటు సెల్ టవర్ మీద ఉన్న సుందర్ ని కుటుంబ సభ్యులు అధికారులు నచ్చ చెప్పారు. ఆర్డీఓ, సింగరేణి, పోలీస్, రెవెన్యూ అధికారులు అతని సమస్య పరిశీలిస్తామని వివరాలతో రావాలని నచ్చచెప్పి సెల్ టవర్ దింపారు. దాదాపు 1,430 రోజులు నుండి తాము న్యాయ పోరాటం చేస్తు న్యాయం జరగడం లేదని సుందర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు సుందర్ హైదరాబాద్ సైతం వెళ్లాడు. హైదరాబాదులో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తిప్పి పంపారు. తన తండ్రి సెల్ టవర్ ఎక్కి నప్పుడు తల్లడిల్లిన సుందర్ కుమారుడు సంజయ్ తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని భావించి గత నెల 29వ తేదీన ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు ఢిల్లీ బయలుదేరాడు. ప్రధానమంత్రి ని కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరతానని.. న్యాయం చేయకపోయినా పర్వాలేదు…. చావడానికైనా అనుమతి ఇవ్వండి అంటూ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు.. సింగరేణి సంస్థతో ఒక కుటుంబం కి జరుగుతున్న సమస్య జిల్లా రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి కి వెళ్ళింది. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నష్టపరిహారం ఇతర ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఇస్తానని అధికారులు మభ్యపెట్టి ఇప్పుడు న్యాయం చేయడం లేదని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!