ఎయిర్పోర్ట్లో నెగిటివ్.. ఇంటికాడ పాజిటివ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఒమిక్రాన్గా రూపాంతరం చెంది మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వేరియంట్ ఇప్పటికే భారత్లో ప్రవేశించేసరికి విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి గత నెలలో వచ్చిన వారిని ట్రేసింగ్ చేసి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఉమిలాడా గ్రామంలో అర్జాల గోపాల కృష్ణ (51) అనే వ్యక్తి గత నెల 23న దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు.
అయితే గోపాల కృష్ణ ఇండియాకు వచ్చిన తరువాత ఎయిర్పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో నెగిటివ్ రావడంతో అతనిని ఎయిర్పోర్ట్ అధికారులు విడిచిపెట్టారు. అయితే గత నెలలో విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేసింగ్ చేసి టెస్టింగ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న సంతబొమ్మాళి గ్రామంలోని పీహెచ్సీలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గోపాల కృష్ణకు పాజిటివ్గా వచ్చింది. దీంతో ఒక్కసారి స్థానికంగా కలకలం రేగింగి. అయితే గోపాల్ కృష్ణను ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గోపాల కృష్ణ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన క్రమంలో అతని శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుకు పంపించారు.
Also Read
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?