Home
Breaking News
Breaking News News
-
ఆన్ లైన్ క్లాసులపై క్లారిటీ ఇచ్చిన ఓయూ..
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లోని అన్ని కోర్సులకు ఆఫ్లైన్ తరగతులు ఫిబ్రవరి 1 మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని సోమవారం సాయంత్రం అధికారులు తెలిపారు. ‘ప్రభుత్వ సూచనల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లోని అన్ని కోర్సులకు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఆఫ్లైన్ తరగతులు ప్రారంభమవుతాయని ఓయూ నుంచి పత్రికా ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు కోర్సులు ఆన్లైన్ మోడ్లో జరుగుతాయని పేర్కొన్నారు. “నగరంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్… -
రాష్ట్రంలో తొలిసారి లక్ష దాటిన ఖాళీ స్థలం చదరపు గజం ధర
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగింపుకు వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఈరోజు నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు రానున్నాయి. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం… -
తెలంగాణలో వంద శాతం కుళాయి నీటి సరఫరా
కుళాయి నీటి సరఫరాలో 100 శాతం సాధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరింది. సోమవారం పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సర్వే 2021-22 నివేదిక ప్రకారం, జనవరి 2 నాటికి భారతదేశంలోని దాదాపు 5.51 కోట్ల కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి సరఫరా అందించబడిన ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హర్యానాతో పాటు తెలంగాణ మాత్రమే ఒక స్థానాన్ని పొందిన ఏకైక ప్రధాన రాష్ట్రంగా నిలిచింది. యాదృచ్ఛికంగా, ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం… -
అర్దరాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారీ కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న అర్దరాత్రి కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అయితే నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా (60) రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో ఓ వివాహానికి షేక్ గుయోష్ పాషా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో షేక్ గుయోష్ పాషా తిరిగి ఇంటికి వెళుతుండగా,… -
వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ..
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క-సారక్క జాతరను పురస్కరించుకొని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా బద్దిపోచమ్మకు ఎంతో భక్తిశ్రద్దలతో, అంగరంగ వైభవంగా శివసత్తుల నృత్యాల నడుమ బోనాలు అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేడు.. వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.… -
నిజాంపేట్ హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం
కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల పొగతో ఆసుపత్రి ప్రాంతం కమ్ముకుపోయింది. ఈఘటనపై సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగి కుటుంబీకులు,… -
జనవరి నెల జీతాలు కొత్త పే స్కేలు ప్రకారమే
ఏపీలో కొత్త పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా పీఆర్సీపై స్పష్టత లేదని, పీఆర్సీ పై స్పష్టత వచ్చే వరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త జీతాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ఏపీ ప్రభుత్వం… -
ఇది రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం : బోరెడ్డి అయోధ్య రెడ్డి
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయని, పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయని ఆయన అన్నారు. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుందని, 51-100… -
హైకోర్టులో బిసినెస్ మేన్ ల డ్రగ్స్ కేసు విచారణ..
హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీ సంబంధాలు పెట్టుకునందున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నేడు హై కోర్టులో విచారణకు వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బిజినెస్ మేన్ లను ను విచారించాల్సిన అవసరం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టోని దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించని పీపీ కోర్టుకు తెలిపారు. నిందితుడు కాల్… -
పర్యావరణహిత చిన్నారి బ్లెస్సీకి మంత్రి కేటీఆర్ ప్రశంసలు
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.…
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..