Home
Breaking News
Breaking News News
-
Yadadri : ఆలేరు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉండి. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన… -
Margani Bharath : దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబేట్కు రెడీ
చంద్రబాబు పోలవరం బ్యారేజీ కడదామనే భ్రమలో ఉన్నారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. అందుకే పోలవరం బ్యారేజీ అంటున్నారని, మేము కడుతుంది పోలవరం ప్రాజెక్టేనని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఒక్క క్యూసెక్కు నీరు చుక్క తగ్గకుండా నీరు స్టోరేజ్ చేస్తామని, చంద్రబాబు తప్పిదాలు కారణంగా డయాఫ్రం వాల్ పునఃనిర్మాణం చేయాల్సి వస్తుందన్నారు. రాజమండ్రి నగరంలో 35 కోట్ల… -
Breaking : హైదరాబాద్లో పలువురు ఐపీఎస్లకు పోస్టింగ్లు
హైదరాబాద్లో పలువురు ఐపీఎస్లకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ను ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. డీసీపీ విజయ్ కుమార్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్యను నియమించింది. ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అయితే సైబరాబాద్ డీసీపీ విజయ్ కుమార్ను ఆకస్మికంగా బదిలీ… -
Errabelli Dayakar Rao : వరంగల్ జిల్లాలో మొట్టమొదటి కేంద్రం ఇది
జనగామ పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జనగామ మున్సిపాలిటీ, చంపక్ హిల్స్లో మానవ విసర్జీతాల శుధ్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ మున్సిపాలిటీ లోపల మల శుద్దీకరణ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషమన్నారు. 2 కోట్ల 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి కేంద్రం ఇది ఆయన వెల్లడించారు. కేసీఆర్ దయవల్ల జనగామను జిల్లా చేసుకున్నామన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం విశాలంగా ఉందని సీఎం… -
AV Ranganath : ప్రజలపై ఆర్థికభారం తగ్గించడానికే చలానా డిస్కౌంట్లు
ప్రజలపై ఆర్థికభారం తగ్గించడానికే చలానా డిస్కౌంట్లు ప్రకటించామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్న దృశ్యా పెండింగ్ చలానా డిస్కౌంట్ ప్రకటించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలానాలతో 1,750 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, డిస్కౌంట్ ప్రకటించడం వల్ల కేవలం 300 కోట్లు మాత్రమే ఆదాయం రానుందన్నారు. ట్రాఫిక్ చలాన్ల వల్లే ప్రభుత్వంకు రెవెన్యూ వస్తుందనే అపోహ ఉండకూడదని, రెవెన్యూ నింపడానికి… -
IVP Raju : 807 రోజులు పాటు రైతులు చేసిన త్యాగ ఫలమే ఈ తీర్పు
అమరావతి రాజధాని విషయంలో వచ్చిన కోర్టు తీర్పుపై విజయనగరం జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపి.రాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని విషయంలో కోర్టు తీర్పుపై అక్కడ రైతులు దీపావళి పండుగ చేసుకుంటున్నారన్నారు. 807 రోజులు పాటు రైతులు చేసిన త్యాగ ఫలమే ఈ తీర్పు అని ఆయన అన్నారు. అమరావతి రైతుల చేసిన ధర్నాలు పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, తద్వారా ఎన్నో దాడులు చేశారు. మహిళలని చూడకుండా వారిపైన కూడా దాడి చేశారని… -
YV Subbareddy : ఆర్జిత సేవల ధరలు పెంపుపై క్లారిటీ…
సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పదిరోజులవుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని ఆయన వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు… -
Srinivas Goud : కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంతోకాలంగా ప్రతీకారంతో రగలిపోతున్న వ్యక్తే ఆయన్ను అంతమొందించేందుకు, సుపారీ ముఠాతో కలసి పథక రచన చేసినట్టు బయటపడుతోంది. ఈ కేసు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్గౌడ్ను హత్య చేసేందుకు.. రాఘవేంద్రరాజు కుటుంబ సభ్యులు సమావేశమైనట్లు,ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్న శ్రీనివాస్గౌడ్ను.. హత్య చేయడమే మార్గమని అన్నదమ్ములు భావించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్గౌడ్పై కోర్టు… -
Ukraine Crisis : ముగిసిన రెండవ విడత శాంతి చర్చలు
యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు అంగీకరించారు. రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు మధ్య బెలారస్లో చర్చలు జరిగాయి. ఈ యుద్దంలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి. పోలిష్-బెలారసియన్ సరిహద్దుల్లో బ్రెస్ట్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం జరిగింది. అయితే ఈ చర్చలు ఆలస్యం అయ్యే కొద్దీ మా డిమాండ్ల… -
Tukaram Gate RUB : రేపు ప్రారంభోత్సవం చేయనున్న కేటీఆర్
తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి (RuB) రూ. 29.10 కోట్లతో శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నాలుగు దిశలలో అభివృద్ధి చెందుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ కదలికలను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని నిర్ధారించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డిపి) కింద ఈ ప్రయత్నాలలో భాగంగా తుకారాం గేట్ రూబిని నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), రైల్వేశాఖ నిధులతో అండర్ బ్రిడ్జితోపాటు అప్రోచ్ రోడ్డు…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!