ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏమవుతాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. తాజా దాడుల్లో ముగ్గురు మృతిచెందారు.
ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఇరాన్-అమెరికా మధ్య కీలక సమావేశం జరగబోతుంది. కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈ చర్చలకు ఇరాన్ వస్తుందా? రాదా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. గ్యాస్, చమురు లభించక ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసింది.
పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం యుద్ధం మరింత భయాందోళనలు కలిగిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. ‘‘అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను అనుకోలేదు.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ను లక్ష్యం చేసుకున్న ఉగ్రవాద గ్రూపులపై అమెరికా సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన రిపోర్ట్ బయట పెట్టింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తోందని నివేదికలో హెచ్చరించింది.
ఇరాన్తో యుద్ధానికి 5 రోజులు బ్రేక్ ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో సానుకూల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అలా ప్రకటించారో.. లేదో టెహ్రాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు చేస్తోంది. తాము టెహ్రాన్లో మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఐడీఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘‘టెహ్రాన్ వ్యాప్తంగా ఇరాన్ ఉగ్రవాద పాలన, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ ఇప్పుడే మరో…
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్కు చెందిన అత్యున్నత నాయకులంతా చనిపోయారు.
Israel-Iran war: ఇరాన్లో కీలక వ్యక్తులు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి సహా పలువురు నిఘా అధికారులు మృతి చెందినట్లు సమాచారం. Israel Defense Forces (IDF) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ రోరింగ్ లయన్”లో భాగంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు పేర్కొంది. ఖచ్చితమైన…