US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
- నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు
- కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు
- చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఇరాన్-అమెరికా మధ్య కీలక సమావేశం జరగబోతుంది. కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈ చర్చలకు ఇరాన్ వస్తుందా? రాదా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి అర్థరాత్రి సమయంలో ఇరాన్ బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. నూర్ఖాన్ ఎయిర్పోర్టులో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వాగతం పలికారు. అయితే ఇరాన్ విమానంలో ఇటీవల అమెరికా దాడుల్లో చనిపోయిన 168 మంది పాఠశాల విద్యార్థుల ఫొటోలు ఖాళీ సీట్లలో పెట్టి నివాళులర్పించిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇక ఇరాన్ బృందానికి స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా.. అమెరికాకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే చర్చలపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. చర్చల సాఫీగా సాగుతాయా? లేదంటే సందిగ్ధం నెలకొంటుందా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరు పక్షాలు కీలక డిమాండ్లు తీసుకొస్తున్నాయి. వీటిపై పీఠముడి వీడుతుందా? లేదన్నది తేలాల్సి ఉంది.
ట్రంప్ వార్నింగ్..
ఇదిలా ఉంటే చర్చలకు ముందు ట్రంప్ ఇరాన్కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని.. ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా? దాడులా? అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!