Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా?
- అంతర్జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు
- 24 గంటల్లో ఉండొచ్చని ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయా? మళ్లీ రెండు దేశాలు చర్చలు జరపనున్నారా? మరోసారి ఇస్లామాబాద్ వేదిక కాబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇప్పటి వరకు ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయి. కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా ఇరాన్ ముందు అమెరికా 14 సూత్రాల శాంతి ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనలను ఇరాన్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో రాబోయే 24-72 గంటల్లో పురోగతి సాధిస్తామని పాకిస్థాన్ అంటోంది. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఆంక్షల సడలింపు, అణ్వాయుధాల నియంత్రణ, కాల్పుల విరమణ పొడిగింపు వంటి అంశాలతో అమెరికా-ఇరాన్ చర్చలు ఒక ఒప్పందానికి చేరువవుతున్నాయని ఇస్లామాబాద్ చెబుతోంది.
Also Read
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
అమెరికా-ఇరాన్ ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు దగ్గరగా ఉన్నాయని.. త్వరలో ఇస్లామాబాద్లో మరో విడత చర్చలు జరగనున్నాయని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలోని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతిపాదనలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించడం, ఘర్షణలకు విరామం ఇవ్వడం, అణు, ప్రాంతీయ భద్రతా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపడం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానాంశం ఏమిటంటే.. యురేనియం శుద్ధిని నిలిపివేయడం, బాలిస్టిక్ క్షిపణి విస్తరణను ఆపడం, ఐక్యరాజ్యసమితి తనిఖీలను అంగీకరించడం, భూగర్భ అణు కేంద్రాల వద్ద కార్యకలాపాలను పరిమితం చేయడం వంటి వాటికి ఇరాన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతించడం వంటివి టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.
పాకిస్థాన్, టర్కీ, రష్యా, చైనా, గల్ఫ్ దేశాలతో సహా పలు దేశాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి.. ఐదు నుంచి 14 సూత్రాల వరకు ఉన్న పలు ముసాయిదాలపై చర్చలు జరిపినట్లు పాకిస్తానీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలుకు హామీలు ఇవ్వడంలో చైనా, రష్యా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కూడా పాలుపంచుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?