Trump-Bangladesh: మాకు రష్యా చమురు కొనుగోలుకు అనుమతివ్వండి.. ట్రంప్కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి
- ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమవుతోన్న ఇంధన సమస్య
- మాకు రష్యా చమురు కొనుగోలుకు అనుమతివ్వండి
- అధ్యక్షుడు ట్రంప్కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. గ్యాస్, చమురు లభించక ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా భారతదేశాన్ని గుర్తుచేశారు. భారతదేశానికి అనుమతి ఇచ్చినట్లుగానే మాకు కూడా రాయితీ ఇవ్వాలని వేడుకుంది.
ఇంధన సంక్షోభం తీవ్ర కావడంతో రష్యా ఇంధన కొనుగోలు ఆంక్షలపై మినహాయింపు ఇవ్వాలని అమెరికాను కోరింది. భారతదేశానికి మంజూరు చేసినటువంటి మినహాయింపులనే కోరింది. రష్యా డీజిల్ కొనుగోలుపై తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారతదేశానికి అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపును జారీ చేసింది. అయితే తమకు రెండు నెలల అవసరాలకు సరిపడా డీజిల్ కావాలని, దానిని రష్యా నుంచి కొనుగోలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ అమెరికాకు తెలిపింది.
Also Read
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
భారతదేశానికి ఇచ్చినటువంటి మినహాయింపునే బంగ్లాదేశ్ కూడా కోరింది. దీని ప్రకారం గరిష్టంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల రష్యన్ డీజిల్ను దిగుమతి చేసుకోవచ్చని ప్రతిపాదించినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
సుమారు 175 మిలియన్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్.. ఇంధన అవసరాల్లో దాదాపు 95 శాతం కోసం దిగుమతులపై ఆధారపడుతుంది. ఈ కొరతను తీర్చడానికి ప్రభుత్వ సంస్థలు ప్రపంచ మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అమెరికా, రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, అంగోలా, ఆస్ట్రేలియాతో సహా సాధ్యమైన ప్రతిచోట నుంచి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రస్తుతం తన భాగస్వాముల నుంచి కూడా దిగుమతులను పెంచుతోంది. బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఏప్రిల్లో భారతదేశంలోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. ఇరాన్ యుద్ధం ఇంధన మార్కెట్ను మరింతగా కుదిపేయవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!