క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ. హెచ్ఆర్ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుతో పడే ఆర్ధికభారంపై చర్చించారు. ఏడువేల 500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కమిటీ ముందు పెట్టిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మంత్రుల కమిటీ. నిన్న రాత్రి వరకు ఉద్యోగులతో…
ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ అంశంపై ఒక నిర్ణయానికి రానుంది ప్రభుత్వం. సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో పది గంటలకు ముఖ్యమంత్రితో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. నిన్న స్టీరింగ్ కమిటీ లో జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనుంది మంత్రుల కమిటీ. హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబులు, సీసీఏ రద్దు, మట్టి ఖర్చులు అంశాలపై ఖజానా పై పడే ఆర్ధికభారం, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను…
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై గందరగోళం నెలకొంది. చరిత్ర ఇటువంటి పీఆర్సీ ప్రకటన చూడలేదని, న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే పీఆర్సీపై ఉద్యోగ సంఘాలను నచ్చజెప్పేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు పీఆర్సీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేందుకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను ఈరోజు చర్చకు ఆహ్వానించింది. అయితే కమిటీ ఇచ్చిన ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. అయితే…
వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH…
న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్సింగరాయ్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో భగ్గుమన్నాయి. తాజాగా నాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మార్కెట్లో ఏదైనా…
విజయనగరం రామతీర్థం బోడికొండపై జరిగిన పరిణామాలు చివరకు కేసుల వరకు వెళ్లాయి.. ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజుపై కేసు నమోదైంది.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఘటనలోకి టీడీపీ అధినేత చంద్రబాబును లాగడంపై అభ్యంతరం వ్యక్తం…
విజయనగరం రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి తెలిసిందే.. బోడికొండపై రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం.. తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై…
అశోక్ గజపతి రాజుపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అశోక్ గజపతి రాజు లాంటి పెద్ద వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని… కనీస సంస్కృతి, సంప్రదాయాలు తెలియని వ్యక్తిలా ఆయన వ్యవహరించారని నిప్పులు చెరిగారు. ఇదేనా ఆయన పెంపకం…వారి తల్లిదండ్రులు ఇదే నేర్పించారా?? అని నిలదీశారు. జిల్లాలో ఏనాడు ఇలాంటినీచమైన సాంప్రదాయాలు జరగలేదని.. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏ రోజు ఒక లెటర్ కూడా రాయలేదని మండిపడ్డారు. ఏ రోజు తన విలువులు కాపాడు…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు వైఎస్ఆర్సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానం లభించింది. ఈ వేడుకకు హాజరైన చిరు, విష్ణు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. చిరంజీవి వేదికపై ప్రజలతో మమేకమవడం చూసి పలువురు మెగాస్టార్తో సెల్ఫీలు దిగారు. అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుతో పాటు వైఎస్సార్సీపీ నేతలు హాజరై వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు బొత్స కుమారుడి నిశ్చితార్థానికి చిరంజీవి హాజరైన విజువల్స్…
టీడీపీ సీనియర్ నేత… గోరంట్ల బుచ్చ చౌదరికి బొత్స సత్య నారాయణ సవాల్ విసిరారు. తాను అబద్దాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి అంటున్నారని… ధైర్యం ఉంటే చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఎవరి వాదం ఏంటో చెబుదామని… రా…ఇద్దరం రాజీనామా చేద్దామని పేర్కొన్నారు బొత్స సత్య నారాయణ. ఇంత వయసు ఉండి అర్ధం లేకుండా మాట్లాడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురువింద గింజలాంటి వ్యక్తి అని.. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని…