బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ యేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నెలలో…
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని యూట్యూబ్లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ‘వారియర్’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో భారీగా ఆదరణ పెరిగింది. హిందీ ప్రేక్షకులు రామ్ కమర్షియల్ ప్యాక్డ్ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. రామ్ పోతినేని ఇప్పుడు ఉత్తర భారత ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్గా నిలిచాడు. నిజానికి ఈ హీరో హిందీలో ఎంట్రీ ఇవ్వనప్పటికీ…
సామాజిక న్యాయంలో లింగ సమానత్వం, అమ్మాయిల అభివృద్ధి గురించి వింటాము, మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని పలుచోట్ల మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. మగవారికి సమానంగా కష్టపడి, సమయం కేటాయించినప్పటికీ వివిధ ప్రైవేట్ రంగాలలో వారు పొందే జీతం ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారితోషికం విషయంలో నటీమణుల పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వివక్ష ఉంటుందన్నది వాస్తవం. తాజాగా ఇదే విషయంపై ఓ బీటౌన్ హీరోయిన్ స్పందించింది. Read…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. అయితే దీనిని హిందీలోనూ డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని హిందీలో సినిమాను పంపిణీ చేయబోతున్న పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కాబోతున్నాయి. గత శుక్రవారం తెలుగు ‘ఖిలాడీ’ని…
కోవిడ్ సమయంలో రియల్ హీరోగా మారిన సోనూసూద్ ఓ యువకుడి ప్రాణాలను కాపాడి మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్లోని మోగాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల బాలుడి ప్రాణాలను బాలీవుడ్ నటుడు సోనూసూద్ రక్షించాడు. సోను ప్రయాణిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు స్థితిని చూసిన సోనూ అందులో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని బయటకు తీసి, దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కారుకు సెంట్రల్…
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్స్ అంతా ముంబైలోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్యతో కలిసి బాలీవుడ్ పాపులర్ డిజైనర్ ఇంట్లో కన్పించగా… ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ను ముందుగా విడుదల చేయాలని అనుకున్నప్పటి నుంచీ చరణ్ తరచుగా ముంబైలో దిగుతున్నారు. ఇటీవలే సోదరి శ్రీజాతో కలిసి అక్కడికి వెళ్లిన చెర్రీ మరోసారి తన భార్య ఉపాసన కామినేనితో కలిసి దర్శనం ఇచ్చారు.…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది. లతా మంగేష్కర్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం చేసిన ఆమె అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ జాబితాలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. లతాజీకి…
భారతదేశపు నైటింగేల్ లతా మంగేష్కర్ ఆదివారం మనందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. లతా మంగేష్కర్ మరణం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ లెజెండరీ సింగర్ కు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పటు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా నిన్న ఆమె ఇంటికి చేరుకున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ కూడా లతా మంగేష్కర్కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చారు. అయితే…
‘టెంపర్, బాహుబలి, ఊపిరి’ వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో అందాలు ఆరబోసిన కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహీ శుక్రవారం హఠాత్తుగా ఇన్ స్టాగ్రామ్ నుండి తప్పుకునే సరికీ ఆమె అభిమానులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. 36.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ స్టాగ్రామ్ నుండి ఆమె ఎందుకు క్విట్ అయ్యిందో తెలియక సతమతమయ్యారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె తిరిగి ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. Read…