ప్రముఖ నటుడు రిషీ కపూర్ 2020 ఏప్రిల్ 30న లుకేమియాతో కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ది బాడీ’ దానికి ముందు సంవత్సరం విడుదలైంది. అయితే అప్పటికే సెట్స్ పై ఉన్న ‘శర్మాజీ నమ్కీన్’ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. హితేశ్ భాటియా దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాలో జుహీచావ్లా, సుహైల్ నయ్యర్, తరుక్ రైనా, సతీష్ కౌశిక్, షీబా చద్దా, ఇషా తల్వార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిషీ కపూర్ మరణానంతరం ఆయన…
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని…
ఇటీవల బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించింది. ఈ వార్తలు నిజం కాదని, తన పేరును ఉపయోగించుకుని పబ్లిసిటీ కోరుకునే వారు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె మండిపడింది. ఏ మేరకు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ ను పంచుకుంది. “నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని సోషల్…
బాలీవుడ్ హీరో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఆయన బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. అయితే 2021 నుంచి జైలులో ఉన్న సచిన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆ వివరాల్లోకి వెళ్తే… మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం / మళ్లించడం వంటి ఆరోపణలపై 2021 ఫిబ్రవరి 14న జోషిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు…
‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనన్య చేసిన పని ఆ రూమర్స్ నిజం అనిపించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా అభిమానులతో తన రిలేషన్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ యేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నెలలో…
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని యూట్యూబ్లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ‘వారియర్’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో భారీగా ఆదరణ పెరిగింది. హిందీ ప్రేక్షకులు రామ్ కమర్షియల్ ప్యాక్డ్ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. రామ్ పోతినేని ఇప్పుడు ఉత్తర భారత ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్గా నిలిచాడు. నిజానికి ఈ హీరో హిందీలో ఎంట్రీ ఇవ్వనప్పటికీ…
సామాజిక న్యాయంలో లింగ సమానత్వం, అమ్మాయిల అభివృద్ధి గురించి వింటాము, మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని పలుచోట్ల మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. మగవారికి సమానంగా కష్టపడి, సమయం కేటాయించినప్పటికీ వివిధ ప్రైవేట్ రంగాలలో వారు పొందే జీతం ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారితోషికం విషయంలో నటీమణుల పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వివక్ష ఉంటుందన్నది వాస్తవం. తాజాగా ఇదే విషయంపై ఓ బీటౌన్ హీరోయిన్ స్పందించింది. Read…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. అయితే దీనిని హిందీలోనూ డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని హిందీలో సినిమాను పంపిణీ చేయబోతున్న పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కాబోతున్నాయి. గత శుక్రవారం తెలుగు ‘ఖిలాడీ’ని…