బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్ కొత్తేమి కాదు. చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు. కలిసి ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. విభేదాలు వస్తే పెళ్లి కాకుండానే విడిపోతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అని కూడా చెప్పవచ్చు. అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులు అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇటీవల ఐ హీరోయిన్ అమీ జాక్సన్.. ప్రియుడితో బిడ్డను కని, ఆ తరువాత అతడికి బ్రేక్ చెప్పింది. ఇప్పుడు మరొక…
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రేమికుల రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెల్సిందే. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో తన తప్పు లేదని, భర్త రితేష్ తనను మోసం చేసినట్లు ఆమె తెలిపింది . బిగ్ బాస్ తరువాత తనకు చాలా విషయాలు తెలిసాయని, అప్పుడు కూడా నేను కలిసి ఉందామనుకున్నా కానీ రితేష్ తనను దూరం పెట్టడంతో విడిపోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇచ్చిన…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఒక రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ఒక పక్క వివాదాలు, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అమ్మడు ఇంత బిజీ షెడ్యూల్లోనూ ‘లాకప్’ అనే షోకి హోస్ట్గా వ్యవహారిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన కంగనా పోస్టర్స్ నెట్టింటో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ షో గురించి…
ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తున్న వివాదం .. హిజాబ్. ముస్లిం మహిళలు హిజాబ్(తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కి, కాలేజీలకు రావాలని అక్కడివారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమధైన రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ వివాదస్పద నటి స్వర భాస్కర్ హిజాబ్ వివాదంపై స్పందించి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. హిజాబ్ వివాదం వింటుంటే .. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుందంటూ…
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని నేడు పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్.. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక రేపు జరగబోయే షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కి చేరుకున్న అమితాబ్ ని అదే లొకేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ రామోజీ…
గత యేడాది డిసెంబర్ 30న విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీని కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేశారు. అయితే తాజాగా ఆ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ఆమీర్ ఖాన్ ఆగస్ట్ కు వాయిదా వేసుకున్నాడు. దాంతో అదే తేదీపై ‘జెర్సీ’ నిర్మాతలు ఇప్పుడు కర్చీఫ్ వేశారు. అయితే ఇదే తారీఖున పాన్ ఇండియా మూవీ…
రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే సమయంలో ముందుగా ప్రకటించినట్టు ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ మాత్రం ఆగస్ట్ 11న రావడం లేదు. ఆ చిత్రాన్ని దర్శక నిర్మాతలు కాస్తంత వెనక్కి పంపుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తెలిపాడు. ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి…