తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రోటీన్ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) సంక్రమణను నాశనం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకంగా పరిగణించబడుతుంది. ఎయిమ్స్లోని బయోఫిజిక్స్ అండ్ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన వైద్యులు ల్యాబ్లో జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిమ్స్ (AIIMS) ఈ పరిశోధన అంతర్జాతీయ మెడికల్ జర్నల్ (ఫ్యూజర్ మైక్రోబయాలజీ జర్నల్)లో ప్రచురించబడింది. భవిష్యత్తులో తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రొటీన్ నుండి బ్లాక్ ఫంగస్కు ఔషధాన్ని తయారు…
కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కాము అనుకున్న చాలామంది కోవిడ్ బాధితులను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది.. దీంతో, కరోనా బారిన పడినవారు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. అయినా, క్రమంగా దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే, బ్లాక్ ఫంగస్ ముప్పు ఎవరిలో ఎక్కువగా ఉంటుందనే విషయంపై ఓ అధ్యయనం నిర్వహించింది హైదరాబాద్ సెంట్రల్…
ఒమిక్రాన్ వేరియంట్ వంటి కరోనా వైరస్లతో పాటు పలు రకాల ఫంగస్లు కూడా ప్రజలకు సోకుతున్నాయి. కాగా బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) చికిత్స కోసం పతంజలి ఆయుర్వేద మెడిసిన్ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘అనూ తైల’ పేరుతో ముక్కు ద్వారా ఈ మందును ఇస్తారని పతంజలి సంస్థ వెల్లడించింది. అధునాతన సాంకేతిక పద్ధతులతో పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ‘అనూ తైల’ మందును కనుగొందని వివరించింది. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీపతి రవి (50) గత కొంతకాలంగా మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం కరోనా మహమ్మారి సోకడంతో దానికి చికిత్స పొందుతున్నాడు. అయితే పది రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ సోకడంతో హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు…
ఇండియాలో కరోనా మహమ్మారి ఒకవైవు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు ట్రీట్మెంట్ తరువాత తలెత్తున్న ఇన్ఫెక్షన్లు ఆంధోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్తో పాటుగా వైట్, యెల్లో, రోజ్ కలర్ ఫంగస్ కేసులు కూడా ఇటీవల నమోదయ్యాయి. ఈయితే, ఇండియాలో ఇప్పుడు మరో ఫంగస్ బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో నివశిస్తున్న ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక ఫంగస్ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అరబిందో…
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో నర్స్గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయమ్మ అనే మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడింది. దీంతో ఆమెను తిరుపతి స్విమ్స్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పద్మావతి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న జయమ్మ, మెడికల్ వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వార్డులో మిగతా రోగుల్లో భయాంధోళనలకు గురయ్యారు. బ్లాక్ ఫంగస్ సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే మరేమైనా…
కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడు సమావేశాలు అన్నీ జూమ్కు పరిమితం అయ్యాయి.. ఇక, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై ను కలిసి.. వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్లను కలిసి వినతిపత్రం…
చిత్తూరు జిల్లాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులతో పాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 135 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 67, స్విమ్స్ లో 70 కేసులను నిర్ధారించారు. ఇక బ్లాక్ ఫంగస్తో ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. బ్లాక్ ఫంగస్ కు మందుల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో రోగులకు అరకొరగా వైద్యం అందుతున్నది. చిత్తూరుతో పాటుగా మిగతా జిల్లాల్లో…
కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బ్లాక్ఫంగస్ పై కీలక సమాచారాన్ని సిఎం జగన్ కు చేరవేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు 1179 ఉన్నాయని.. ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని తెలిపారు అధికారులు. బ్లాక్ ఫంగస్ వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని.. కోవిడ్ లేకున్నా.. బ్లాక్ ఫంగస్ వస్తోందని సీఎంకు అధికారుల వెల్లడించారు. 40…
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా దేశాన్ని భయపెడుతున్నాయి. రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండటం అంధోళన కలిగిస్తోంది. నార్త్ ఇండియాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆంధోళన కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 650కి పైగా కేసులు నమోదవ్వగా, 50 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. బ్లాక్…