గణేశుడికే ‘విఘ్నం’.. ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఫైట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి వస్తుందంటే ఊళ్లల్లో ఉండే సందడే వేరు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ప్రతియేటా ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఈసారి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అందరూ భావిస్తున్నారు. మరో ఐదురోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జగన్ సర్కారు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు ఏపీలో కాకరేపుతున్నాయి.
కరోనా నేపథ్యంలో గణేష్ ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. మండపాలకు, ఊరేగింపులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. నిమజ్జనాలు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులపై బీజేపీ నేతలు గరంగరం అవుతున్నారు. ఏ పండుగలకు లేని ఆంక్షలు వినాయక ఉత్సవాలకే ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గుడ్ ఫ్రైడ్, మొహర్రం పండుగలు నిర్వహించారని గుర్తు చేశారు. దీనికితోడు ఇటీవల థియేటర్లు, పాఠశాలలను తెరిచారని, వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వాటిన్నింటికి వర్తించని కరోనా నిబంధనలు కేవలం హిందూ పండుగలకే ఎందుకు వర్తింపజేస్తారంటూ జగన్ సర్కారును బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కరోనా టైంలో తమకు కూడా ప్రజారోగ్యం ముఖ్యమేనని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పండుగ నిర్వహించుకునేలా ప్రభుత్వం ఆదేశాలని ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
అయితే వైసీపీ మాత్రం అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాలపై ఇలాంటి నిబంధనలు విధించామని చెబుతోంది. గణేష్ ఉత్సవాల్లో జనాలు గుమ్మిగూడే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రజలంతా కరోనా నిబంధనలకు అలవాటుపడిన క్రమంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తే ఏమవుతుందని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ప్రభుత్వం ఆంక్షలు విధించడం కరెక్టేనని అంటున్నారు. ఏదిఏమైనా గణేష్ ఉత్సవాలను కేంద్రంగా చేసుకొని ఏపీలో బీజేపీ వర్సెస్ వైఎస్సాఆర్సీపీ మధ్య వేడి రాజుకుంది. ఈ పండుగ వార్ లో మున్ముందు ఎవరూ పైచేయి సాధిస్తారో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!