గణేశుడికే ‘విఘ్నం’.. ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఫైట్?
వినాయక చవితి వస్తుందంటే ఊళ్లల్లో ఉండే సందడే వేరు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ప్రతియేటా ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఈసారి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అందరూ భావిస్తున్నారు. మరో ఐదురోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జగన్ సర్కారు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు ఏపీలో కాకరేపుతున్నాయి.
కరోనా నేపథ్యంలో గణేష్ ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. మండపాలకు, ఊరేగింపులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. నిమజ్జనాలు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులపై బీజేపీ నేతలు గరంగరం అవుతున్నారు. ఏ పండుగలకు లేని ఆంక్షలు వినాయక ఉత్సవాలకే ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గుడ్ ఫ్రైడ్, మొహర్రం పండుగలు నిర్వహించారని గుర్తు చేశారు. దీనికితోడు ఇటీవల థియేటర్లు, పాఠశాలలను తెరిచారని, వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వాటిన్నింటికి వర్తించని కరోనా నిబంధనలు కేవలం హిందూ పండుగలకే ఎందుకు వర్తింపజేస్తారంటూ జగన్ సర్కారును బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కరోనా టైంలో తమకు కూడా ప్రజారోగ్యం ముఖ్యమేనని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పండుగ నిర్వహించుకునేలా ప్రభుత్వం ఆదేశాలని ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
అయితే వైసీపీ మాత్రం అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాలపై ఇలాంటి నిబంధనలు విధించామని చెబుతోంది. గణేష్ ఉత్సవాల్లో జనాలు గుమ్మిగూడే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రజలంతా కరోనా నిబంధనలకు అలవాటుపడిన క్రమంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తే ఏమవుతుందని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ప్రభుత్వం ఆంక్షలు విధించడం కరెక్టేనని అంటున్నారు. ఏదిఏమైనా గణేష్ ఉత్సవాలను కేంద్రంగా చేసుకొని ఏపీలో బీజేపీ వర్సెస్ వైఎస్సాఆర్సీపీ మధ్య వేడి రాజుకుంది. ఈ పండుగ వార్ లో మున్ముందు ఎవరూ పైచేయి సాధిస్తారో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో