Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందంటూ అరిచి గోల చేసింది.
PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (ఏప్రిల్ 11న) వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆయన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలుకనున్నారు.
Nitish Kumar: బీహార్కి చెందిన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ని ‘‘ఉప ప్రధానమంత్రి’’ అని అన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఎన్డీయేకు నితీష్ కుమార్ చాలా కృషి చేశారని అన్నారు. బీహార్ ఎన్నికల ముందు బీజేపీ నాయకుడు చేసిన ప్రకటన అందర్ని ఆశ్చర్యపరిచింది.
Kangana Ranaut: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ బ్రిటిష్ వలసవాద వారసత్వం, గతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ పార్టీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఆశాంతి, భయానక వాతావరణం ఉండేదని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. తమ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేస్తోంది.. అందులో భాగంగా.. ఏపీలో బీజేపీ ఇవాళ్టి నుంచి గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం మొదలుపెట్టనుంది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను అమలుచేసేందుకు రెడీ అవుతుంది.
TMC: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, కీర్తి ఆజార్ మధ్య వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, బీజేపీ నేత అమిత్ మాల్వియా వీరి మధ్య గొడవల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పరిస్థితి విషమించడంతో తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సంత్ కబీర్ ఆలోచనల్ని కలిగి ఉందని అన్నారు. పాట్నాలో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’ కార్యక్రమంలో రామహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Punjab: పంజాబ్ జలంధర్లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా నివాసం వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ కేసును 12 గంటల్లో ఛేదించామని పోలీసులు వెల్లడించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ‘‘పెద్ద కుట్ర’’ జరిగిందని పంజాబ్ పోలీసులు తెలిపారు.
మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి.. తొలిసారి రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.. అయితే, తనకు మంత్రి కావాలని లేదు.. మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యే వాడిని అని స్పష్టం చేశారు.. నా జీవితానికి ఇది చాలు.