Assam: ‘లుంగీ’ vs ‘గాడ్సే రివాల్వర్’.. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ పంచాయతీ..
- అస్సాంలో ‘‘లుంగీ వర్సెస్ గాడ్సే రివాల్వర్’’ అంశం..
- బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంలో పంచాయతీ ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ‘‘లుంగీ vs గాడ్సే రివాల్వర్’’ పంచాయతీ నడుస్తోంది. కాంగ్రెస్ ధోతీలను పంపిణీ చేయడాన్ని అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన గుర్తుకు బదులుగా, లుంగీని ఎంచుకోవాలని అన్నారు. అయితే, దీనికి కాంగ్రెస్ స్పందిస్తూ.. బీజేపీ ‘‘గాడ్సే రివాల్వర్’’ని ఎంచుకోవాలని సూచించింది. నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేయడాన్ని ఇది సూచిస్తుంది.
Read Also: India Bangladesh: బంగ్లాదేశ్లో కీలక రైలు ప్రాజెక్ట్ నిలిపేసిన భారత్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
2001-2016 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అస్సాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని హిమంత ఆరోపించారు. సోమవారం ధేమాజీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పాలనను ఎండగట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో లుంగీ, ధోతీ మాత్రమే ఉన్నాయని, కాంగ్రెస్ తన గుర్తుని చేతికి బదులుగా లుంగీగా మార్చుకోవాలని అని అననారు. ఈ ప్రాంతంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు ‘‘లుంగీలను’’ ఎక్కువగా ఉపయోగిస్తారు.
బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ భూపేన్ కుమార్ బోరా స్పందించారు. కాంగ్రెస్ లుంగీ, ధోలీ, పైజామా, ప్యాంట్ అన్ని దుస్తుల్ని సమానంగా పరిగణిస్తుందని అన్నారు. కాంగ్రెస్ దృక్పథం అందర్ని కలుపుకుపోవడమే అని, బీజేపీ తన గుర్తు ‘‘కమలానికి’’ బదులుగా నాథురామ్ గాడ్సే గాంధీని హత్య చేయడానికి ఉపయోగించిన తుపాకీతో భర్తీ చేయాలని అన్నారు. అస్సాంలో పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో మే 2, మే 7న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మే 11న ఉండనుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!