Yogi On Babri Masjid: ఢిల్లీలో ఈరోజు ( డిసెంబర్ 6న) జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో రాష్ట్రంలో "అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, అంతా బాగానే ఉంది" అని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది.
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
తెలంగాణలో పొత్తులకు సంబంధించి బీజేపీ హై కమాండ్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. మనం సోలో.... సింహం సింగిల్గానే వస్తుందంటూ పదే పదే చెబుతున్నారు ఢిల్లీ పెద్దలు. ఎన్నిక ఏదైనాసరే... మనది ఒంటరి పోరేనని సూటిగా సుత్తిలేకుండానే పార్టీ మీటింగ్స్లో చెప్పేస్తున్నారు.
రూపాయి మారకం విలువ ప్రస్తుతం క్షీణించింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించి 90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్ హాల్లోకి వెళ్తున్న వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీని ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది.
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల్లో మాదిరిగానే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కూడా కమలనాథులు సీరియస్గా తీసుకుంటున్నారు.
జార్ఖండ్లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అధికార మార్పిడి జరుగుతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హేమంత్ సోరెన్ సర్కార్.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్లో కీలక పోస్ట్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లోని 12 వార్డుల్లో ఎన్నికలు జరగగా ఏడింటిని బీజేపీ గెలుచుకుంది.
Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ‘‘కుక్క’’ను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన రేణుకా చౌదరికి మద్దతు ఇచ్చారు. ‘‘పార్లమెంట్కు కుక్కల్ని అనుమతించరా.?’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.