ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రగడ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం కర్ణాటకకు వచ్చారు.
Giriraj Singh: బీహార్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష నేతలు కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. జనవరి 10న బెగుసరాయ్ జిల్లాలోని బచ్వారాలో జరిగిన సమావేశానికి బీహార్ పశుసంవర్ధక మంత్రి, బచ్వార ఎమ్మెల్యే సురేంద్ర మెహతా నిర్వహించారు. గిరిరాజ్ సింగ్ సహా సీనియర్ NDA నాయకులు హాజరయ్యారు. Read Also:…
Annamalai: బీజేపీ నేత కే.అన్నామలై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై తీవ్రంగా స్పందించారు. ఠాక్రేల బెదిరింపులు తనను ముంబై రాకుండా అడ్డుకోలేవని సోమవారం అన్నారు. ఇటీవల, ముంబైలో శివసేన-ఎఎన్ఎస్ ర్యాలీలో అన్నామలైని ఎగతాళి చేస్తూ ఠాక్రేలు బెదిరించే వ్యాఖ్యలు చేశారు.
CM Yogi: కులం, మతం, వర్గం ఆధారంగా జరిగే విభజనలు సంపూర్ణ వినాశనానికి కారణం అవుతాయని, బంగ్లాదేశ్ పరిస్థితులు తలెత్తుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్ రాజ్లోని మాఘ మేళాలో కార్యక్రమంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ ఘటనపై ఎవరూ మాట్లాడరు. లౌకివాదం పేరుతో దుకాణాలు నడుపుతున్న వ్యక్తులు హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తు్న్నారు. సనాతన ధర్మాన్ని విడదీయాలని అనుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్ సంఘటనల విషయానికి వస్తే వారి…
Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు.
Didi vs ED: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కోల్కతాలో ఐ-ప్యాక్ కార్యాలయం, ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ సోదాలు జరుగుతున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన ఘటనా స్థలానికి రావడం, ఐ ప్యాక్ ఆఫీసుల నుంచి కీలకమైన కొన్ని ఫైళ్లను తీసుకెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాలపై ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి…
Devendra Fadnavis: “బుర్ఖా ధరించిన ముస్లిం” ముంబై మేయర్ పీఠాన్ని చేపట్టవచ్చని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల మౌనాన్ని సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు. మరాఠీ హిందువే తదుపరి ముంబై మేయర్ అవుతారని ఆయన అన్నారు. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, బీజేపీ మరాఠీ, మరాఠీయేతర ఓటర్లనున విభజించడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను తిప్పికొట్టారు. ముంబై మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడిందా.? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. అవును అంటూ…
Mamat Banerjee: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్లో ఈడీ సంచలన దాడులు నిర్వహించింది. సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న ఐ-ప్యాక్పై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా ఈడీ దాడులు టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ ఏకకాలంలో ఈ రోజు దాడులు…
మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో బద్ధశత్రువులైన కాంగ్రెస్-బీజేపీ చేతులు కలపడం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏక్నాథ్షిండేకు చెందిన శివసేన పార్టీ మీద కోపంతో హస్తం-కమలం నేతలు చేతులు కలిపినట్లుగా తెలుస్తోంది.