Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- డీలిమిటేషన్ బిల్లుపై సంజయ్ రౌత్ యూటర్న్..
- మార్పులు చేస్తే మద్దతు ఇస్తామని ప్రకటన..
- 360 ఎంపీల మద్దతకు మరో 3 అడుగుల దూరంలో ఎన్డీయే సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Bill: లోక్సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. వర్షాకాల సమావేశాల్లో సభ ముందుకు ఈ బిల్లును మరోసారి తీసుకురాబోతోంది. మెజారిటీ మార్క్ సాధించేందుకు ప్రతిపక్ష ఎంపీల మద్దతు కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.
గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని, అయితే తాము సూచించిన సవరణలు చేస్తే దానికి మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు ముందు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచే విధంగా మార్పులు చేపడితే తాము మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 131 రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లు ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని చూస్తోంది. ప్రస్తుతం శివసేన యూబీటీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం 9 మంది ఎంపీలను గెలిపించుకుంది. ఇటీవల ఆరుగురు ఉద్ధవ్ పార్టీ నుంచి షిండే శివసేన పార్టీలో చేరారు.
మూడింట రెండు వంతుల మెజారిటికీ 3 ఓట్లు కావాలి:
గత లోక్సభ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే దానికి అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. దీనికి 540 మంది ఎంపీల్లో 360 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం టీఎంసీ రెబల్ ఎంపీలు 20 మంది, ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి శివసేనలోకి ఫిరాయించిన 6 మంది, ఎన్సీపీ-శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన 8 మంది మద్దతు ఉంది. మొత్తం సంఖ్య 332కు చేరింది. డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు మద్దతు ఇస్తే 354 మంది ఎంపీలకు సంఖ్య చేరుతుంది. మరో ఆరుగురు ఎంపీలు మాత్రమే అవసరం అవుతారు. ఇప్పుడు శివసేన యూబీటీకి చెందిన ముగ్గురు ఎంపీలు మద్దతు ఇస్తే మరో ముగ్గురు ఎంపీలు మద్దతు బీజేపీ సర్కార్కు అవసరం అవుతారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!