Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- డీలిమిటేషన్ బిల్లుపై సంజయ్ రౌత్ యూటర్న్..
- మార్పులు చేస్తే మద్దతు ఇస్తామని ప్రకటన..
- 360 ఎంపీల మద్దతకు మరో 3 అడుగుల దూరంలో ఎన్డీయే సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Bill: లోక్సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. వర్షాకాల సమావేశాల్లో సభ ముందుకు ఈ బిల్లును మరోసారి తీసుకురాబోతోంది. మెజారిటీ మార్క్ సాధించేందుకు ప్రతిపక్ష ఎంపీల మద్దతు కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.
గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని, అయితే తాము సూచించిన సవరణలు చేస్తే దానికి మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు ముందు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచే విధంగా మార్పులు చేపడితే తాము మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 131 రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లు ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని చూస్తోంది. ప్రస్తుతం శివసేన యూబీటీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం 9 మంది ఎంపీలను గెలిపించుకుంది. ఇటీవల ఆరుగురు ఉద్ధవ్ పార్టీ నుంచి షిండే శివసేన పార్టీలో చేరారు.
మూడింట రెండు వంతుల మెజారిటికీ 3 ఓట్లు కావాలి:
గత లోక్సభ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే దానికి అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. దీనికి 540 మంది ఎంపీల్లో 360 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం టీఎంసీ రెబల్ ఎంపీలు 20 మంది, ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి శివసేనలోకి ఫిరాయించిన 6 మంది, ఎన్సీపీ-శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన 8 మంది మద్దతు ఉంది. మొత్తం సంఖ్య 332కు చేరింది. డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు మద్దతు ఇస్తే 354 మంది ఎంపీలకు సంఖ్య చేరుతుంది. మరో ఆరుగురు ఎంపీలు మాత్రమే అవసరం అవుతారు. ఇప్పుడు శివసేన యూబీటీకి చెందిన ముగ్గురు ఎంపీలు మద్దతు ఇస్తే మరో ముగ్గురు ఎంపీలు మద్దతు బీజేపీ సర్కార్కు అవసరం అవుతారు.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!