Minister KTR: మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు.. ఆయన ఎవ్వరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్ళు ఇయ్యక పొతే ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న సిఎం కేసీఆర్.
జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.. అయితే, పవన్ కమలం పార్టీకి రాంరాం చెప్పారా?, టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది.
రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించ కముందే ఈ భేటీని అత్యంత కీలకంగా భావిస్తుంది.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ బండారం బయటపెడితే ముఖ్యమంత్రి కుమారుడు అంత ఉల్లిక్కి పడుతున్నారు ఎందుకని డీకే అరుణ విమర్శించారు. బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ లో స్పందించారు. మోడీ చెప్పినట్లుగా NDA లో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు.. నిజమై తప్పక ఉండి ఉంటదని తెలిపారు.
ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారన్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలని విమర్శించారు.
సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము... డబ్బులు ఇచ్చింది మేమన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది...ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదని హరీష్ రావు అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని.. ఈసారి అదే గతి పడుతుందని అన్నారు. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే అని ఎద్దేవా చేశారు.