Union Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. పలు బిల్లులకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించ కముందే ఈ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. ప్రజలకు తక్షణ ఉపశమనం లభించేలా కొన్ని నిర్ణయాలు తీసుకోని వాటిని ఉపయోగించుకోని ఎన్నికలలో క్యాష్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది.
Read Also: Incense Sticks: అగరుబత్తీల వ్యాపారుల పాలిట వరంగా మారిన పితృపక్షం.. లాభాలే లాభాలు
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఇక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నందున ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి కష్టంగా మారుతుంది. అయితే, కేంద్ర మంత్రివర్గంతో పాటు ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం కూడా నేడు జరుగుతుంది. ఈ సమావేశంపై కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పీఆర్సీ పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
Read Also: Bathukamma Sarees: తెలంగాణ మహిళలకు గుడ్న్యూస్.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
ఇక, జూలై నుంచి డీఏను పెంచాలని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కోరారు. కేంద్ర ప్రభుత్వం డీఏను 3 శాతం వరకు పెంచే అవకాశం ఉండటంతో.. అది 42 శాతం నుంచి 45 శాతానికి పెరుగుతుంది. అయితే, పెరిగిన డీఏతో పాటు అక్టోబర్ నెల జీతం కూడా వస్తుందని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ మంత్రివర్గం నుండి ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే, ఇది దసరా ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద బహుమతి అవుతుంది. పీఆర్సీ పెంపుతో 47 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?