Union Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. పలు బిల్లులకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించ కముందే ఈ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. ప్రజలకు తక్షణ ఉపశమనం లభించేలా కొన్ని నిర్ణయాలు తీసుకోని వాటిని ఉపయోగించుకోని ఎన్నికలలో క్యాష్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది.
Read Also: Incense Sticks: అగరుబత్తీల వ్యాపారుల పాలిట వరంగా మారిన పితృపక్షం.. లాభాలే లాభాలు
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
ఇక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నందున ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి కష్టంగా మారుతుంది. అయితే, కేంద్ర మంత్రివర్గంతో పాటు ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం కూడా నేడు జరుగుతుంది. ఈ సమావేశంపై కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పీఆర్సీ పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
Read Also: Bathukamma Sarees: తెలంగాణ మహిళలకు గుడ్న్యూస్.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
ఇక, జూలై నుంచి డీఏను పెంచాలని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కోరారు. కేంద్ర ప్రభుత్వం డీఏను 3 శాతం వరకు పెంచే అవకాశం ఉండటంతో.. అది 42 శాతం నుంచి 45 శాతానికి పెరుగుతుంది. అయితే, పెరిగిన డీఏతో పాటు అక్టోబర్ నెల జీతం కూడా వస్తుందని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ మంత్రివర్గం నుండి ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే, ఇది దసరా ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద బహుమతి అవుతుంది. పీఆర్సీ పెంపుతో 47 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!