PM Modi: ప్రధాని, సీఎంగా కాకుండా.. అలా ఉండటానికి గొప్ప గర్వంగా ఉంటుంది
- నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొ్న్న మోడీ
- బీజేపీ ప్రాధాన్యతలను వివరించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన జీవితంలో అతి పెద్ద గౌరవం మూడు సార్లు ప్రధానిగా ఉండడం.. 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడం కాదని.. బీజేపీ కార్యకర్తగా ఉండటమే తనకు గొప్ప గర్వమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై ప్రసంగించారు.
‘‘మోడీ దేశానికి ప్రధానమంత్రి అని… మూడోసారి ప్రధాని అయ్యారని.. 50 ఏళ్ల చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని.. 25 ఏళ్ల నుంచి నిరంతరంగా పాలిస్తున్నారని ప్రజలు అనుకోవచ్చు గానీ.. అదంతా నిజమే కానీ నా జీవితంలో వీటన్నిటికంటే గొప్పది మరొకటి ఉంది. నేను బీజేపీ కార్యకర్తను. అదే నాకు గొప్ప గర్వం. పార్టీ విషయాల విషయానికి వస్తే నేను ఒక కార్యకర్తను. ఇప్పుడు నితిన్ నబిన్ నా బాస్.’’ అని మోడీ పేర్కొన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ప్రజలకు సేవ చేయడం బీజేపీకి ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనదని ప్రధాని అన్నారు. ‘‘మేము అధికారాన్ని ఆనంద సాధనంగా కాకుండా సేవ మాధ్యమంగా మార్చాం. అందువల్ల బీజేపీపై ప్రజల విశ్వాసం నిరంతరం బలపడింది. గత 11 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుంటే.. బీజేపీ ప్రయాణం ప్రజల విశ్వాసాన్ని సంపాదించే అద్భుతమైన ప్రయాణం.’’ అని మోడీ పేర్కొన్నారు.
నితిన్ నబిన్..
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ సమక్షంలో నితిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జేడీ నడ్డా సహా ఎంపీలు, పార్టీ సీనియర్లు హాజరయ్యారు.
చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత నితిన్ నబిన్కే దక్కింది. నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్కు తొలి పరీక్ష కానుంది.
ఇది కూడా చదవండి: Trump: మిత్రదేశాలతో చెడుతున్న మైత్రి.. ఫ్రాన్స్పై 200 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ వార్నింగ్
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!