PM Modi: ప్రధాని, సీఎంగా కాకుండా.. అలా ఉండటానికి గొప్ప గర్వంగా ఉంటుంది
- నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొ్న్న మోడీ
- బీజేపీ ప్రాధాన్యతలను వివరించిన ప్రధాని
తన జీవితంలో అతి పెద్ద గౌరవం మూడు సార్లు ప్రధానిగా ఉండడం.. 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడం కాదని.. బీజేపీ కార్యకర్తగా ఉండటమే తనకు గొప్ప గర్వమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై ప్రసంగించారు.
‘‘మోడీ దేశానికి ప్రధానమంత్రి అని… మూడోసారి ప్రధాని అయ్యారని.. 50 ఏళ్ల చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని.. 25 ఏళ్ల నుంచి నిరంతరంగా పాలిస్తున్నారని ప్రజలు అనుకోవచ్చు గానీ.. అదంతా నిజమే కానీ నా జీవితంలో వీటన్నిటికంటే గొప్పది మరొకటి ఉంది. నేను బీజేపీ కార్యకర్తను. అదే నాకు గొప్ప గర్వం. పార్టీ విషయాల విషయానికి వస్తే నేను ఒక కార్యకర్తను. ఇప్పుడు నితిన్ నబిన్ నా బాస్.’’ అని మోడీ పేర్కొన్నారు.
Also Read
- NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
ప్రజలకు సేవ చేయడం బీజేపీకి ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనదని ప్రధాని అన్నారు. ‘‘మేము అధికారాన్ని ఆనంద సాధనంగా కాకుండా సేవ మాధ్యమంగా మార్చాం. అందువల్ల బీజేపీపై ప్రజల విశ్వాసం నిరంతరం బలపడింది. గత 11 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుంటే.. బీజేపీ ప్రయాణం ప్రజల విశ్వాసాన్ని సంపాదించే అద్భుతమైన ప్రయాణం.’’ అని మోడీ పేర్కొన్నారు.
నితిన్ నబిన్..
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ సమక్షంలో నితిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జేడీ నడ్డా సహా ఎంపీలు, పార్టీ సీనియర్లు హాజరయ్యారు.
చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత నితిన్ నబిన్కే దక్కింది. నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్కు తొలి పరీక్ష కానుంది.
ఇది కూడా చదవండి: Trump: మిత్రదేశాలతో చెడుతున్న మైత్రి.. ఫ్రాన్స్పై 200 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ వార్నింగ్
తాజావార్తలు
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
-
IPL CheerLeaders Salary: గ్లామర్తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
-
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
-
CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!