Mallikarjun Kharge: మోడీ ఎప్పుడైనా టీ చేశారా.. ఓట్ల కోసమే ‘‘చాయ్వాలా’’గా చెప్పుకున్నారు..
- ప్రధాని మోడీ ఎప్పుడైనా ‘‘టీ’’ చేశారా..?
- ఓట్ల కోసమే ‘‘చాయ్వాలా’’గా చెప్పుకుంటున్నారు..
- మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: రాజకీయ దుమారానికి కారణమయ్యే విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఓట్ల కోసమే తనను తాను ‘‘చాయ్వాలా’’గా చెప్పుకున్నారని ఆరోపించారు. ‘‘ఓట్ల కోసం నేను టీ అమ్మేవాడిని అని చెబుతుంటారు. ఆయన ఎప్పుడైనా టీ చేశారా.? ఎప్పుడైనా కెటిల్ పట్టుకుని ప్రజలకు టీ అందించారా.? ఇదంతా ఒక నాటకం. పేదలను అణచివేయడం ఒక అలవాటు’’ అని ఖర్గే అన్నారు. యూపీఏ హయాంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో బీజేపీ ప్రభుత్వం జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడంపై కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. ఈ కార్యక్రమంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రచారాంలో బిజీగా ఉందని ఆయన అన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇన్ని పెద్ద ప్రాజెక్టులు తీసుకువచ్చారని, బీజేపీ చేసిన ఒక్క పని చెప్పండి అంటూ ఖర్గే అడిగారు.
Read Also: Ramdas Athawale: ఆ పని చేస్తే ఎక్కువ నిధులు ఇస్తాం.. సీఎం పినరయి విజయన్కు ఎన్డీయే ఆఫర్..
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత టామ్ వడక్కన్ మాట్లాడుతూ.. ప్రధాని ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చారనేది వాస్తవం, ఈ విషయాన్ని కాదనలేమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సిల్వర్ స్పూన్తో పుట్టిన వారసత్వ నాయకులు ఉన్నారని, వారు పొందిన హక్కులను వారు కాదనగలరా? , కాంగ్రెస్ సత్యంపై నిలబడదని అన్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కామ్దార్ ప్రధాని అయితే, నామ్ దార్ కాంగ్రెస్ సహించదని బీజేపీ అధికార ప్రతినిధి హెహజాద్ పూనావాలా విమర్శించారు. కాంగ్రెస్ గతంలో ప్రధాని చాయ్వాలా నేపథ్యాన్ని ఎగతాళి చేస్తూ 150 సార్లు తిట్టారని, వారిని ప్రజలు క్షమించరని అన్నారు.
గుజరాత్ వాద్నగర్ స్టేషన్లో తన తండ్రి టీ స్టాల్ నడిపేవాడని, తాను చిన్నప్పుడు తనకు సాయం చేశానని ప్రధాని మోడీ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాజవంశస్తులు అని బీజేపీ తరుచు ఎగతాళి చేస్తుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. మోడీని ఎగతాళి చేస్తూ, ఆయనకు ఎప్పటికీ ప్రధాని కాలేరని, ఒక చాయ్వాలా ప్రధాని పదవికి అనర్హుడనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రధానిగా మోడీ మూడోసారి అధికారంలో ఉన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?