Home
Bjp
Bjp News
-
Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
బెంగళూరులో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఒకసారి నీట్ పరీక్ష రద్దు కావడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. తిరిగి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 (ఆదివారం) నిర్వహించింది. అంతా సజావుగా సాగుతుందన్న తరుణంలో మరో రాజకీయ పంచాయితీ చెలరేగింది. -
Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తన నామినేషన్ తిరస్కరణకు కారణంగా చెబుతున్న అంశాలపై వివరణ ఇచ్చిన ఆమె.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అన్నారు. లీగల్ నోటీసు మాత్రమే వచ్చిందని, అది కూడా ఒక ప్రైవేట్ పిటిషన్కు సంబంధించినదేనని తెలిపారు. ఫార్మ్-26లో లీగల్ నోటీసులను తప్పనిసరిగా… -
Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
Venkaiah Naidu: యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూస్తే అది మూర్ఖత్వం అవుతోందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సికింద్రాబాద్ ఫరెడ్ గ్రౌండ్స్లో యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యోగా చేస్తే సమగ్ర మనిషిగా మారుతారని.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్నారు. యోగా సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వతోముఖాభివృద్ధికి యోగా అవసరమని పేర్కొన్నారు. మానవ చైతన్యానికి నిదర్శనం యోగా అని.. పూర్వీకులు రంగరించి… -
Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray: శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పక్ష నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శివసేన (షిండే వర్గం), బీజేపీతో పాటు పార్టీని వీడిన తిరుగుబాటు ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీలో ఏ ఒక్క… -
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
Delimitation Explained: నిన్నటి వరకు అసాధ్యం అనుకున్నది.. ఇవాళ సుసాధ్యం అయ్యేలా కనిపిస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న సంక్షోభాలు అధికార పక్షానికి వరంగా మారాయి. అందుకే రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ సర్కార్ సంచలనాలకు సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన.. మహిళా రిజర్వేషన్లు.. జమిలి ఎన్నికల లాంటి కీలక బిల్లులను పాస్ చేయించుకునేందుకు మోదీ సర్కార్ కేవలం కొన్ని ఓట్ల దూరంలోనే మిగిలింది. ఆ మ్యాజిక్ ఫిగర్ను ఎన్డీఏ ఎలా సాధించబోతోంది? విపక్షాల నుంచి అధికార పక్షంలోకి… -
UP: సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. -
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
CM Revanth Reddy: హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే అంతర్జాతీయ ప్రమాణాల రవాణా సౌకర్యాలు అవసరమని, ఆ ఆలోచనతోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ నిర్ణయం యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రారంభంలో రూ.15 వేల కోట్ల అంచనాతో మెట్రో పనులు… -
Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
Pinarayi Vijayan: ఇండియా కూటమిలో అలజడి చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే, ప్రతిపక్ష కూటమి సమావేశానికి డీఎంకే దూరమైంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల సమావేశానికి హాజరైనప్పటికీ, ఆమె పార్టీ ముక్కలైంది. ఈ నేపథ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న సీపీఎం కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కేరళ మాజీ సీఎం, సీసీఎం నేత పినరయి విజయన్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల రాహుల్ గాంధీ… -
Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
Bhatti Vikramarka : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల ఓట్లను గంపగుత్తగా తొలగిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇవే: ‘SIR’ పేరుతో పద్ధతి ప్రకారం ఓట్ల తొలగింపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా , సవరణ (Special Intensive Revision –… -
Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
అంబర్పేట్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచందర్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తిగా లేరని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అబద్ధాలకు తల్లిగా అభివర్ణించిన ఆయన.. హామీలను నెరవేర్చలేక ప్రజలను తప్పుదారి…
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!