నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి…
Mallu Bhatti Vikramarka: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారిపై కేసులు పెడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.
Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో నేడు (ఏప్రిల్ 19) ఓటింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పైగురితో సహా మూడు ప్రధాన నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది.
Lok Sabha Elections: స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇండియా కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమైంది.
Sanjay Singh : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై కొనసాగుతున్న వివాదం మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ విలేకరుల సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తొలి విడత పోలింగ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి దశలోనే తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో ఈరోజు M కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గన్నవరం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు , ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ పరిశీలకులు మరియు ఇన్చార్జ్ ఆకుల వెంకట నాంచారయ్య,…