Naravane Book: నరవణే బుక్ విడుదల కాలేదు.. పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన
- నరవణే బుక్ విడుదల కాలేదు
- పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన విడుదల
- దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న పుస్తకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ పుస్తకం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అటు పార్లమెంట్లోనూ.. ఇటు పబ్లిక్లోనూ రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ పుస్తకంపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఈ పుస్తకం బయటకు రావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేతిలోకి ఆ పుస్తకం ఎలా వచ్చిందన్న అంశంపై కూపీ లాగుతున్నారు.
పబ్లిషర్ పెంగ్విన్ స్పందన.
ఇదిలా ఉంటే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. ఆ పుస్తకం ప్రచురణ హక్కులు తామే కలిగి ఉన్నామని.. అది ముద్రించలేదని.. డిజిటల్ రూపంలోనూ విడుదల కాలేదని స్పష్టం చేసింది. నరవణే పుస్తక కాఫీలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
అమ్మకానికి ప్రజలకు అందుబాటులో ఉంచలేదని స్పష్టం చేసింది. అనధికారిక ప్రచారంలో ఉన్న కాపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. డిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే పుస్తకం సోషల్ మీడియాలోనూ.. ఆన్లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
రాహుల్ గాంధీ..
తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నా పుస్తకం అందుబాటులో ఉందని మనోజ్ నరవణే ట్వీట్ చేశారు. పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ అయినా అబద్దం చెప్పుండాలి… లేదంటే నరవణే అయినా అబద్దం చెప్పుండాలి. నేను అయితే నరవణే ట్వీట్ను నమ్ముతున్నాను. పుస్తకం అమెజాన్లో అందుబాటులో ఉంది. పుస్తకంలో భారత ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకి అసౌకర్యంగా ప్రకటనలు ఉండొచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. నరవణే పుస్తకంపై ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ప్రతిపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!