Naravane Book: నరవణే బుక్ విడుదల కాలేదు.. పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన
- నరవణే బుక్ విడుదల కాలేదు
- పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన విడుదల
- దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న పుస్తకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ పుస్తకం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అటు పార్లమెంట్లోనూ.. ఇటు పబ్లిక్లోనూ రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ పుస్తకంపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఈ పుస్తకం బయటకు రావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేతిలోకి ఆ పుస్తకం ఎలా వచ్చిందన్న అంశంపై కూపీ లాగుతున్నారు.
పబ్లిషర్ పెంగ్విన్ స్పందన.
ఇదిలా ఉంటే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. ఆ పుస్తకం ప్రచురణ హక్కులు తామే కలిగి ఉన్నామని.. అది ముద్రించలేదని.. డిజిటల్ రూపంలోనూ విడుదల కాలేదని స్పష్టం చేసింది. నరవణే పుస్తక కాఫీలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అమ్మకానికి ప్రజలకు అందుబాటులో ఉంచలేదని స్పష్టం చేసింది. అనధికారిక ప్రచారంలో ఉన్న కాపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. డిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే పుస్తకం సోషల్ మీడియాలోనూ.. ఆన్లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
రాహుల్ గాంధీ..
తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నా పుస్తకం అందుబాటులో ఉందని మనోజ్ నరవణే ట్వీట్ చేశారు. పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ అయినా అబద్దం చెప్పుండాలి… లేదంటే నరవణే అయినా అబద్దం చెప్పుండాలి. నేను అయితే నరవణే ట్వీట్ను నమ్ముతున్నాను. పుస్తకం అమెజాన్లో అందుబాటులో ఉంది. పుస్తకంలో భారత ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకి అసౌకర్యంగా ప్రకటనలు ఉండొచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. నరవణే పుస్తకంపై ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ప్రతిపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!