Congress: హిమంత దారిలో భూపెన్ బోరా.. మరో కీలక నాయకుల్ని కోల్పోయిన కాంగ్రెస్..
- అస్సాం ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్..
- పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత భూపెన్ బోరా..
- బోరాను కలవనున్న సీఎం హిమంత బిశ్వ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: అస్సాం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ బోరా రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామం తర్వాత అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ, బోరాను వ్యక్తిగతంగా కలువనున్నట్లు ప్రకటించారు. బోరా రాజీనామాపై హిమంత మాట్లాడుతూ.. ‘‘ భూపెన్ బోరా అస్సాం కాంగ్రెస్ లో అట్టడుగు స్థానం నుంచి ఎదిగిన ప్రముఖ హిందూ నేత. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం ఆయనను కలవనున్నాను. బీజేపీలో ఆయన చేరితే అస్సాం, దేశ సేవలో మరింత బలం చేకూరుతుంది’’ అని అన్నారు.
Read Also: Valentine’s Day Shocker: భార్యతో వాలెంటైన్స్ డే డిన్నర్, రాత్రి మర్డర్..
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
అస్సాం కాంగ్రెస్ చీఫ్గా గౌరవ్ గొగోయ్ బాధ్యతలు తీసుకునే ముందు 2021-25 వరకు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోరా పనిచేశారు. ప్రస్తుతం, అస్సాం కాంగ్రెస్లో గొగోయ్ ఆధిపత్య ధోరణి కారణంగానే బోరా రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. బోరా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. 32 ఏళ్లగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ఇప్పుడు విస్మరించారని, తనకు తగిన గౌరవం కల్పించలేదని ఆయన ఆరోపించారు.
బోరా రాజీనామా ద్వారా కాంగ్రెస్లో సాధారణ వ్యక్తి అభివృద్ధి చెందలేదనే సందేశాన్ని పంపిందని, బోరాను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని, బీజేపీలో చేరాలని నిర్ణయించుకుంటే ఆయనకు సురక్షిత స్థానం నుంచి ఎన్నికయ్యేలా చేస్తామని హిమంత చెప్పారు. సీఎం హిమంత తనను కలుస్తాననే వ్యాఖ్యలపై బోరా స్పందిస్తూ.. ఏ ముఖ్యమంత్రి అయినా తన ఇంటికి వస్తే అది తనకు గర్వకారణం అని బోరా అన్నారు. ఇదిలా ఉంటే, రాజీనామాపై పునరాలోచన చేయాలని గొగోయ్, ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్, దేబబ్రత సైకియాతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!