BJP is leading in four seats in the by-elections: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీతో నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
By-elections Results: దేశంలో నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుపు సాధిస్తారనేది నేడు తెలియనుంది. ఇందులో కొన్ని స్థానాలు బీజేపీకి చాలా కీలకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, తెలంగాణలోని మునుగోడు, బీహార్ లోని మోకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదంపూర్, ఒడిశాలోని ధామ్ నగర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోల గోకరనాథ్ నియోజకవర్గాలకు ఎన్నిలకు జరిగాయి.
రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.
రైలులోని టాయిలెట్లో చనిపోయిన ఓ వ్యక్తిని ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహంతోనే రైలు దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్లోని రోజా స్టేషన్లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అమృత్సర్ వెళ్తున్న సహర్స-అమృతసర్ జన్సేవా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది.
బిహార్లోని గయా జిల్లాలోని గుర్పా రైల్వే స్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. గురువారం ఉదయం ధన్బాద్ డివిజన్లోని కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ల మధ్య బొగ్గుతో కూడిన గూడ్స్ రైలుకు చెందిన 53 వ్యాగన్లు బోల్తా పడ్డాయి.
అప్పటివరకు ఉత్సాహంగా ఓ వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. బీహార్లోని చప్రా జిల్లాలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ మతపరమైన కార్యక్రమంలో వేదికపై కుప్పకూలి గుండెపోటుతో మరణించారు.
మందుబాబులం మేం మందుబాబులం అంటే చాలు గబ్బర్ సింగ్ మూవీ గుర్తుకు రావాల్సిందే అందులో కోటా శ్రీనివాస్ రావు పోలీస్టేషన్ లో చేసే హడావుడి ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాగుబోతులంటే ఎందుకంత చులకన అంటూ వేసే స్టేప్పులతో ఆసాంగ్ కు సినిమా హాల్ లో విజల్స్ తో దద్దరిల్లింది.
BJP MLA's Controversial Comments on Hindu Gods: బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హిందూ దేవీదేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. భాగల్పూర్ జిల్లాలోని పిర్పైంటి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలను ప్రశ్నించారు. తన వైఖరిని నిరూపించుకోవడానికి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై భాగల్ పూర్ లోని షెర్మారీ బజార్ లో ఆయనకు వ్యతిరేకంగా…
బీహార్లోని ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరుచేసే ప్రశ్న ఉందని ఆరోపిస్తూ దుమారం చెలరేగింది. ఈ ఘటన బిహార్లోని కిషన్గంజ్లో గల పాఠశాలలో జరిగింది.