By-elections: ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు తేలేది నేడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
By-elections Results: దేశంలో నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుపు సాధిస్తారనేది నేడు తెలియనుంది. ఇందులో కొన్ని స్థానాలు బీజేపీకి చాలా కీలకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, తెలంగాణలోని మునుగోడు, బీహార్ లోని మోకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదంపూర్, ఒడిశాలోని ధామ్ నగర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోల గోకరనాథ్ నియోజకవర్గాలకు ఎన్నిలకు జరిగాయి.
ఇందులో మునుగోడు, అందేరీ ఈస్ట్ తో పాటు బీహార్ లోని మోకామా, గోపాల్ గంజ్ నియోజవర్గాలను ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వాన్ని దించేసి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో అంధేరి ఈస్ట్ లో శివసేన ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ లత్కే మరణించడంతో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా ఈ సీటు గెలుపుపై తమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భావిస్తోంది.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
Read Also: Gujarat Elections: గుజరాత్ పీఠం బీజేపీదే.. హిమాచల్లో కూడా కాషాయమే..
బీహార్ లోని రెండు స్థానాల్లో ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. గతంలో బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ జేడీయూ పార్టీ.. కొన్ని నెలల క్రితం పొత్తును తెంచుకుని ఆర్జేడీ పార్టీతో చేతులు కలిపి నితీష్ కుమార్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొకామా, గోపాల్ గంజ్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుతున్నాయి. మొకామాలో సిట్టింగ్ ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై అనర్హత వేటుతో, గోపాల్ గంజ్ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణంతో ఎన్నికలు వస్తున్నాయి. బీహార్ లో బీజేపీ బలపడాలంటే, ఆర్జేడీ, జేడీయూలకు ఎదురునిలవాలంటే ఈ ఎన్నికల్లో గెలుపు బీజేపీకి చాలా కీలకం.
ఇక తెలంగాణలోని మునుగోడులో మొనగాడు ఎవరో నేడు తేలనుంది. బీజేపీ తెలంగాణలో బలపడుతున్నామనే అభిప్రాయాన్ని కలిగించాలంటే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!