Bihar: 4వేల దేవాలయాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. 3నెలల గడువు విధించిన సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. రిజిస్టర్డ్ దేవాలయాలు, మఠాల భూమి ఆక్రమణకు గురికాకుండా నిరోధించడానికి బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నమోదిత దేవాలయాలకు ఫెన్సింగ్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. బీహార్లోని అన్ని ప్రభుత్వ దేవాలయాలు,మఠాలు, ట్రస్టులు మరియు ధర్మశాలలు బీహార్ హిందూ రిలీజియస్ ట్రస్టుల చట్టం, 1950 ప్రకారం తప్పనిసరిగా బీఎస్బీఆర్టీలో నమోదు చేయబడాలి. అనధికార క్లెయిమ్ల నుంచి దేవాలయాల భూమితో సహా ఆస్తులను రక్షించడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
అధికారులు పదేపదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంకా 4000 దేవాలయాలు, మఠాలు, ట్రస్ట్లు రిజిస్టర్ కాలేదు. అవి బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ (BSBRT)లో మూడు నెలల్లోగా నమోదు చేసుకోవాలి. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు తమ తమ జిల్లాల్లో నమోదుకాని సంస్థలన్నీ మూడు నెలల్లోగా రిజిస్టర్ అయ్యేలా చూడాలని తాను అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు లేఖ పంపుతున్నానని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ అన్నారు. రిజిస్టర్ కాని దేవాలయాలు, మఠాలు, ట్రస్టులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వస్తుందన్నారు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మహిళా సర్పంచ్ భర్త దారుణ హత్య
అవసరమైతే ఎమ్మెల్యే ఏరియా డెవలప్మెంట్ ఫండ్లో కొంత భాగాన్ని కొన్ని నమోదిత దేవాలయాలు ట్రస్టుల వద్ద తగినంత డబ్బు లేకపోతే ఫెన్సింగ్ కోసం ఉపయోగించవచ్చని మంత్రి చెప్పారు. ఆ పరిస్థితిలో ఎమ్మెల్యేలు రిజిస్టర్డ్ పబ్లిక్ దేవాలయాలు, ట్రస్టుల జాబితాను ఇవ్వాలన్నారు. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం నమోదిత దేవాలయాల సంఖ్య 3002 కాగా.. వాటికి 18,500 ఎకరాలకు పైగా భూమి ఉంది. 35 జిల్లాల నుంచి అందిన, బీఎస్బీఆర్టీ సంకలనం చేసిన తాజా డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4055 నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయని.. అవి 4400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నాయన్నారు. జిల్లాల పరిపాలన విభాగం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముజఫర్పూర్ (433), సమస్తిపూర్ (272), దర్భంగా (259), తూర్పు చంపారన్ (226), భాగల్పూర్ (210), వైశాలి (209)లో అత్యధిక సంఖ్యలో నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయి. సీతామర్హి (203), రోహ్తాష్ (210), భోజ్పూర్ (197), బెగుసరాయ్ (170), నలంద (159), సరన్ (154) జిల్లాల్లో నమోదు కానీ దేవాలయాలు ఉన్నాయని బీఎస్బీఆర్టీ డేటా పేర్కొంది.
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!