Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bihar Makes Registration Must For Over 4000 Temples And Deadline 3 Months

Bihar: 4వేల దేవాలయాలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. 3నెలల గడువు విధించిన సర్కారు

Published Date :November 5, 2022 , 4:44 pm
By Mahesh Jakki
Bihar: 4వేల దేవాలయాలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. 3నెలల గడువు విధించిన సర్కారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bihar: రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. రిజిస్టర్డ్ దేవాలయాలు, మఠాల భూమి ఆక్రమణకు గురికాకుండా నిరోధించడానికి బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నమోదిత దేవాలయాలకు ఫెన్సింగ్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. బీహార్‌లోని అన్ని ప్రభుత్వ దేవాలయాలు,మఠాలు, ట్రస్టులు మరియు ధర్మశాలలు బీహార్ హిందూ రిలీజియస్ ట్రస్టుల చట్టం, 1950 ప్రకారం తప్పనిసరిగా బీఎస్‌బీఆర్టీలో నమోదు చేయబడాలి. అనధికార క్లెయిమ్‌ల నుంచి దేవాలయాల భూమితో సహా ఆస్తులను రక్షించడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

అధికారులు పదేపదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంకా 4000 దేవాలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు రిజిస్టర్‌ కాలేదు. అవి బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ (BSBRT)లో మూడు నెలల్లోగా నమోదు చేసుకోవాలి. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు తమ తమ జిల్లాల్లో నమోదుకాని సంస్థలన్నీ మూడు నెలల్లోగా రిజిస్టర్ అయ్యేలా చూడాలని తాను అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లకు లేఖ పంపుతున్నానని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ అన్నారు. రిజిస్టర్ కాని దేవాలయాలు, మఠాలు, ట్రస్టులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వస్తుందన్నారు.

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
  • Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..

Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మహిళా సర్పంచ్ భర్త దారుణ హత్య

అవసరమైతే ఎమ్మెల్యే ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్‌లో కొంత భాగాన్ని కొన్ని నమోదిత దేవాలయాలు ట్రస్టుల వద్ద తగినంత డబ్బు లేకపోతే ఫెన్సింగ్ కోసం ఉపయోగించవచ్చని మంత్రి చెప్పారు. ఆ పరిస్థితిలో ఎమ్మెల్యేలు రిజిస్టర్డ్ పబ్లిక్ దేవాలయాలు, ట్రస్టుల జాబితాను ఇవ్వాలన్నారు. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం నమోదిత దేవాలయాల సంఖ్య 3002 కాగా.. వాటికి 18,500 ఎకరాలకు పైగా భూమి ఉంది. 35 జిల్లాల నుంచి అందిన, బీఎస్‌బీఆర్‌టీ సంకలనం చేసిన తాజా డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4055 నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయని.. అవి 4400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నాయన్నారు. జిల్లాల పరిపాలన విభాగం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముజఫర్‌పూర్ (433), సమస్తిపూర్ (272), దర్భంగా (259), తూర్పు చంపారన్ (226), భాగల్‌పూర్ (210), వైశాలి (209)లో అత్యధిక సంఖ్యలో నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయి. సీతామర్హి (203), రోహ్తాష్ (210), భోజ్‌పూర్ (197), బెగుసరాయ్ (170), నలంద (159), సరన్ (154) జిల్లాల్లో నమోదు కానీ దేవాలయాలు ఉన్నాయని బీఎస్‌బీఆర్టీ డేటా పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • Bihar government
  • Bihar Law Minister Shamim Ahmad
  • registration for temples
  • temples in bihar

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions