Bihar: 4వేల దేవాలయాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. 3నెలల గడువు విధించిన సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. రిజిస్టర్డ్ దేవాలయాలు, మఠాల భూమి ఆక్రమణకు గురికాకుండా నిరోధించడానికి బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నమోదిత దేవాలయాలకు ఫెన్సింగ్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. బీహార్లోని అన్ని ప్రభుత్వ దేవాలయాలు,మఠాలు, ట్రస్టులు మరియు ధర్మశాలలు బీహార్ హిందూ రిలీజియస్ ట్రస్టుల చట్టం, 1950 ప్రకారం తప్పనిసరిగా బీఎస్బీఆర్టీలో నమోదు చేయబడాలి. అనధికార క్లెయిమ్ల నుంచి దేవాలయాల భూమితో సహా ఆస్తులను రక్షించడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
అధికారులు పదేపదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంకా 4000 దేవాలయాలు, మఠాలు, ట్రస్ట్లు రిజిస్టర్ కాలేదు. అవి బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ (BSBRT)లో మూడు నెలల్లోగా నమోదు చేసుకోవాలి. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు తమ తమ జిల్లాల్లో నమోదుకాని సంస్థలన్నీ మూడు నెలల్లోగా రిజిస్టర్ అయ్యేలా చూడాలని తాను అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు లేఖ పంపుతున్నానని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ అన్నారు. రిజిస్టర్ కాని దేవాలయాలు, మఠాలు, ట్రస్టులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వస్తుందన్నారు.
Also Read
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మహిళా సర్పంచ్ భర్త దారుణ హత్య
అవసరమైతే ఎమ్మెల్యే ఏరియా డెవలప్మెంట్ ఫండ్లో కొంత భాగాన్ని కొన్ని నమోదిత దేవాలయాలు ట్రస్టుల వద్ద తగినంత డబ్బు లేకపోతే ఫెన్సింగ్ కోసం ఉపయోగించవచ్చని మంత్రి చెప్పారు. ఆ పరిస్థితిలో ఎమ్మెల్యేలు రిజిస్టర్డ్ పబ్లిక్ దేవాలయాలు, ట్రస్టుల జాబితాను ఇవ్వాలన్నారు. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం నమోదిత దేవాలయాల సంఖ్య 3002 కాగా.. వాటికి 18,500 ఎకరాలకు పైగా భూమి ఉంది. 35 జిల్లాల నుంచి అందిన, బీఎస్బీఆర్టీ సంకలనం చేసిన తాజా డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4055 నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయని.. అవి 4400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నాయన్నారు. జిల్లాల పరిపాలన విభాగం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముజఫర్పూర్ (433), సమస్తిపూర్ (272), దర్భంగా (259), తూర్పు చంపారన్ (226), భాగల్పూర్ (210), వైశాలి (209)లో అత్యధిక సంఖ్యలో నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయి. సీతామర్హి (203), రోహ్తాష్ (210), భోజ్పూర్ (197), బెగుసరాయ్ (170), నలంద (159), సరన్ (154) జిల్లాల్లో నమోదు కానీ దేవాలయాలు ఉన్నాయని బీఎస్బీఆర్టీ డేటా పేర్కొంది.
తాజావార్తలు
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
-
Yash: రాకింగ్ స్టార్ యష్తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
-
Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!