Midday Meal in Bihar: బల్లి పడిందన్నా బలవంతంగా తినిపించారు.. 200మంది పరిస్థితి ఏమైందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Midday Meal in Bihar: బల్లి పడిన భోజనం తిన్న 200మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బీహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భాగల్ పూర్లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులరకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అంతకు ముందు విద్యార్థులు భోజనంలో బల్లి పడిందని ఆ పాఠశాల సిబ్బందికి తెలిపినా వారు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బల్లిపడినా ఆ భోజనమే తినాలంటూ బలవంతం చేశారు. తర్వాత ట్యూషన్కు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలిన వారంతా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉపాధ్యాయుడు, సిబ్బంది పాఠశాల సమీపంలోని ఓ వైద్యకేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Chikoti Praveen Meets MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యేతో క్యాసినో కింగ్ భేటీ
Also Read
ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థికి ప్లేట్లో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ విషయాన్ని విద్యార్థులు హెడ్ మాస్టర్ కు చెప్పారు. కానీ, ఆయన దానిని బల్లి కాదని, వంకాయ అని చెప్పాడు. తినకుంటే పస్తులుండాల్సి వస్తుందని.. అదే ఆహారాన్ని తినాలని బలవంతం చేశాడు. దీంతో స్టూడెంట్స్ ఏమీ చేయలేక అదే ఆహారాన్ని తిన్నారు. కాసేపటికే వాంతులతో ఆస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను విద్యా శాఖ సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు చేపట్టి, వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..