Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?
Bihar Politics: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడి ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వంలో ముసలం నెలకొంది. సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, ఆర్జేడీ పొత్తు నుంచి వైదొగాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారం చేజిక్కించుకునేందుకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాట్నాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్పూరీ ఠాకూర్కి మరణానంతరం కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడం, ఆ కార్యక్రమంలో ఆర్జేడీపై పరోక్షంగా సీఎం నితీష్ కుమార్ విమర్శించడం, ప్రధాని మోడీని ధన్యవాదాలు తెలపడం ఇలా ఒక్కొక్క సంఘటన నితీష్ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇక లాలూ కుమర్తె రోహిణి ఆచార్య సీఎం నితీష్ కుమార్ టార్గెట్గా ట్వీట్స్ వివాదాన్ని మరింతగా పెంచింది.
ఇదిలా ఉంటే జేడీయూ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి చేరుతున్నట్లు, పాత మిత్రుడు బీజేపీకి నితీష్ దగ్గరవుతున్నట్లు గురువారం పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి అశ్విని చౌబే హుటాహుటిన అధిష్టానాన్ని కలిసేందుకు పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అవుట్.. మళ్లీ బీజేపీతో జట్టు..?
అధికారం కోసం లాలూ ప్లాన్..?
మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వద్ద సందడి నెలకొంది. ప్రస్తుత పరిణామాలను చర్చించేందుకు జేడీయూ నాయకులు లాలన్ సింగ్, విజయ్ కుమార్ చౌదరి, ఇతర నాయకులు నితీష్ కుమార్తో భేటీ అయ్యారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీహార్ అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటేందుకు ఎమ్మెల్యేల సంఖ్యపై కసరత్తు చేస్తున్నట్లు సమచారం. బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు ఆర్జేడీకి 122 మంది ఎమ్మెల్యేలు అవసరంగా కాగా, ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అయితే బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ శిబిరంలోని నలుగరు ఎమ్మెల్యేలు, ఎంఐఎం నుంచి ఒకరు, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్జేడీలో చేరచ్చనే ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ఆర్జేడీకి అధికారం కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం నితీష్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జేడీయూ పోటీ చేయవచ్చని తెలుస్తోంది.
- Tags
- bihar
- bjp
- CM Nitish Kumar
- INDIA Bloc
- JDU
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!