Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడి ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వంలో ముసలం నెలకొంది. సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, ఆర్జేడీ పొత్తు నుంచి వైదొగాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారం చేజిక్కించుకునేందుకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాట్నాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్పూరీ ఠాకూర్కి మరణానంతరం కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడం, ఆ కార్యక్రమంలో ఆర్జేడీపై పరోక్షంగా సీఎం నితీష్ కుమార్ విమర్శించడం, ప్రధాని మోడీని ధన్యవాదాలు తెలపడం ఇలా ఒక్కొక్క సంఘటన నితీష్ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇక లాలూ కుమర్తె రోహిణి ఆచార్య సీఎం నితీష్ కుమార్ టార్గెట్గా ట్వీట్స్ వివాదాన్ని మరింతగా పెంచింది.
ఇదిలా ఉంటే జేడీయూ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి చేరుతున్నట్లు, పాత మిత్రుడు బీజేపీకి నితీష్ దగ్గరవుతున్నట్లు గురువారం పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి అశ్విని చౌబే హుటాహుటిన అధిష్టానాన్ని కలిసేందుకు పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.
Also Read
Read Also: Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అవుట్.. మళ్లీ బీజేపీతో జట్టు..?
అధికారం కోసం లాలూ ప్లాన్..?
మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వద్ద సందడి నెలకొంది. ప్రస్తుత పరిణామాలను చర్చించేందుకు జేడీయూ నాయకులు లాలన్ సింగ్, విజయ్ కుమార్ చౌదరి, ఇతర నాయకులు నితీష్ కుమార్తో భేటీ అయ్యారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీహార్ అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటేందుకు ఎమ్మెల్యేల సంఖ్యపై కసరత్తు చేస్తున్నట్లు సమచారం. బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు ఆర్జేడీకి 122 మంది ఎమ్మెల్యేలు అవసరంగా కాగా, ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అయితే బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ శిబిరంలోని నలుగరు ఎమ్మెల్యేలు, ఎంఐఎం నుంచి ఒకరు, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్జేడీలో చేరచ్చనే ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ఆర్జేడీకి అధికారం కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం నితీష్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జేడీయూ పోటీ చేయవచ్చని తెలుస్తోంది.
- Tags
- bihar
- bjp
- CM Nitish Kumar
- INDIA Bloc
- JDU
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!