Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడి ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వంలో ముసలం నెలకొంది. సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, ఆర్జేడీ పొత్తు నుంచి వైదొగాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారం చేజిక్కించుకునేందుకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాట్నాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్పూరీ ఠాకూర్కి మరణానంతరం కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడం, ఆ కార్యక్రమంలో ఆర్జేడీపై పరోక్షంగా సీఎం నితీష్ కుమార్ విమర్శించడం, ప్రధాని మోడీని ధన్యవాదాలు తెలపడం ఇలా ఒక్కొక్క సంఘటన నితీష్ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇక లాలూ కుమర్తె రోహిణి ఆచార్య సీఎం నితీష్ కుమార్ టార్గెట్గా ట్వీట్స్ వివాదాన్ని మరింతగా పెంచింది.
ఇదిలా ఉంటే జేడీయూ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి చేరుతున్నట్లు, పాత మిత్రుడు బీజేపీకి నితీష్ దగ్గరవుతున్నట్లు గురువారం పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి అశ్విని చౌబే హుటాహుటిన అధిష్టానాన్ని కలిసేందుకు పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అవుట్.. మళ్లీ బీజేపీతో జట్టు..?
అధికారం కోసం లాలూ ప్లాన్..?
మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వద్ద సందడి నెలకొంది. ప్రస్తుత పరిణామాలను చర్చించేందుకు జేడీయూ నాయకులు లాలన్ సింగ్, విజయ్ కుమార్ చౌదరి, ఇతర నాయకులు నితీష్ కుమార్తో భేటీ అయ్యారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీహార్ అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటేందుకు ఎమ్మెల్యేల సంఖ్యపై కసరత్తు చేస్తున్నట్లు సమచారం. బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు ఆర్జేడీకి 122 మంది ఎమ్మెల్యేలు అవసరంగా కాగా, ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అయితే బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ శిబిరంలోని నలుగరు ఎమ్మెల్యేలు, ఎంఐఎం నుంచి ఒకరు, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్జేడీలో చేరచ్చనే ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ఆర్జేడీకి అధికారం కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం నితీష్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జేడీయూ పోటీ చేయవచ్చని తెలుస్తోంది.
- Tags
- bihar
- bjp
- CM Nitish Kumar
- INDIA Bloc
- JDU
తాజావార్తలు
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!