Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అవుట్.. మళ్లీ బీజేపీతో జట్టు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్క్రమించే అవకాశం ఉందని బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు బీహార్ మహఘటబంధన్ కూటమి నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తును ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. పాత మిత్రుడు బీజేపీతో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు పలు వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో కూడా నితీష్ కుమార్ పాల్గొనవద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూల మధ్య పొసగడం లేదు. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. రోహిణి చేసిన ట్వీట్ గురించి నితీష్ కుమార్ సమాచారం కోరారని, ఆర్జేడీతో పొత్తుకు స్వస్తి పలికి, పదవి నుంచి వైదొలిగి, బీహార్ అసెంబ్లీ రద్దుకు కూడా సిఫారసు చేసే అవకాశం ఉందని సోర్సెస్ తెలిపాయి.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Pragya Jaiswal : గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్.. ఇలా చూస్తే కుర్ర గుండెలు పేలిపోతాయ్..
ఇటీవల బీహార్ నేత కర్పూరీ ఠాకూర్కి మరణానంతరం కేంద్రం ‘భారత రత్న’ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై నితీష్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మాట్లాడుతూ.. వంశపారపర్య రాజకీయాలపై విమర్శలు చేయడంతో.. ఆర్జేడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంతా భావిస్తున్నారు. దీని తర్వాత లాలూ కుమార్తె రోహిణి చేసిన ట్వీట్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ‘ప్రజలు తరచుగా వారి స్వంత లోపాలను చూడలేరు కానీ ఇతరులపై బురద చల్లడం కొనసాగిస్తారు’’ ట్వీట్ చేశారు, ఆ తర్వాత అర్హతను ప్రస్తావిస్తూ మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ రెండు ట్వీట్లను ఆమె తొలగించారు. ఇవి పరోక్షంగా నితీష్ కుమార్ని అన్నట్లు తెలుస్తోంది. దీంతో వివాదం మరింత ముదిరింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!