బీహార్లో కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తప్పించుకున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. మైక్రోఫోన్ను లాక్కొని కేంద్రమంత్రిపై పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు.
Chirag Paswan: కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో విభేదాలను తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ నుంచి తనకు విడదీయరాని బంధం ఉందని, తనను విడదీయలేరని అన్నారు. బీజేపీ కోరుకుంటే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Govt Schools Closed: భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల దాటికి బీహార్ రాష్ట్ర రాజధానిలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగి పోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
NSG New Chief: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే జాతీయ భద్రత దళం కొత్త డైరెక్టర్ జనరల్గా (DG) సీనియర్ ఐపీఎస్ అధికారి బి.శ్రీనివాసన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Bihar: బీహార్ అరారియాలో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లో కారం పొడి పోసి దాడి చేయడం వైరల్గా మారింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడ్డాడనే అభియోగంపై కొందరు బాధితుడి చేతులు వెనకకు కట్టి, ప్యాంట్ విప్పి, అతడి ప్రైవేట్ పార్టులో కారం పోసి, కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, బీహార్లోని సున్నీ వక్ఫ్ బోర్డు ఒక గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు భూమి వక్ఫ్ భూమిగా పేర్కొంటూ ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ వివాదాస్పద ప్రాంతంలో నివసించే వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్య పాట్నా హైకోర్టు ముందు ఉంది, సున్నీ వక్ఫ్ బోర్డు వారి వాదనలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమైంది.
Extramarital affair: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ తల్లి. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి, 3 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపింది. ప్రియుడితో వెళ్లేందుకు ఈ ఘతుకానికి పాల్పడింది. బీహార్ ముజఫర్పూర్లో సూట్కేస్లో మూడేళ్ల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత,
Murder Video: బీహార్ లోని హాజీపూర్లో వార్డు కౌన్సిలర్ పంకజ్రాయ్ పై కాల్పులు జరిగాయి. సమాచారం మేరకు బైక్పై వచ్చిన దుండగులు వార్డు కౌన్సిలర్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. పంకజ్ రాయ్ 5వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. అతను తన దుకాణం బయట కూర్చున్న సమయంలో దుండగులు వచ్చి కాల్చిచంపారు. ఇకపోతే దాడుల నేపథ్యంలో.. అతను ఇంట్లోకి పరిగెత్తాడు. అయితే అతని వెనుకే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కూడా అతనిని మూడుసార్లు…
Food Poison: బీహార్ రాష్ట్రంలోని సుపాల్ లోని ఇండో – నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న భీమ్ నగర్ లో ఉన్న బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీసుల 250 మంది ట్రైనీ సైనికులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. అస్వస్థతకు గురైన సైనికులందరికీ వీర్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీసుల 12వ, 15వ బెటాలియన్ లలో శిక్షణ కోసం వచ్చారని సమాచారం. ఈ ట్రైనీ సైనికులందరూ ఆదివారం మధ్యాహ్నం భోజనం…