Election Commission: ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ
- పౌరుల మధ్య ఈసీ విపక్ష చూపదు
- బీహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశాం
- తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈసమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది, ఆచరిస్తుందని స్పష్టం చేశారు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని, ఓటు చోరీ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల సంఘానికి అధికార, విపక్ష పార్టీలు సమానమని అన్నారు.
READ MORE: Rahul Gandhi: కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీలో లక్షకు పైగా ఓట్లు చోరీ అయ్యాయి!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
18ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని, పౌరుల మధ్య ఈసీ విపక్ష చూపదని అన్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదని, బీహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తుపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నికల సంఘం పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. బీహార్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉందని, తమ బాధ్యత నుంచి వెనక్కి వెళ్లలేదని వెల్లడించారు. తమపై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదుని, ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి లోపాలను తొలగించడంలో ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. ముసాయిదా జాబితాలోని క్లెయిమ్లు, అభ్యంతరాల సమయం ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉందని, గడువు తీరడానికి ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలోని లోపాలను అన్ని రాజకీయ పార్టీలు ఫారమ్ కింద సమర్పించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ద్వారాలు అందరికీ సమానంగా తెరిచి ఉన్నాయని స్పష్టం చేశారు.
జిల్లా అధ్యక్షుడు, బీఎల్ఏల ధృవీకరణ జాతీయ పార్టీకి చేరకపోవడం, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగించే విషయని అన్నారు. బీహార్లోని 7 కోట్లకు పైగా ఓటర్లు ఎన్నికల కమిషన్కు మద్దతు ఇస్తే, ఈసీ విశ్వసనీయతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలో మెరుగుదల కోరుతున్నాయని, ఈ డిమాండ్ను నెరవేర్చడానికి బీహార్ నుంచి SIR ప్రారంభించినట్లు తెలిపారు. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తప్ప మరే ఇతర అంశంపైనా ఎన్నికల కమిషన్ అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అనేది జరగదు. కానీ ఈ రోజు ఈసీ మొదటి సారి సమావేశం నిర్వహించింది.
READ MORE: Hyderabad :కార్మికుల సమ్మెపై చిరంజీవితో నిర్మాత సి.కల్యాణ్ కీలక చర్చ!
తాజావార్తలు
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!