Election Commission: ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ
- పౌరుల మధ్య ఈసీ విపక్ష చూపదు
- బీహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశాం
- తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈసమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది, ఆచరిస్తుందని స్పష్టం చేశారు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని, ఓటు చోరీ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల సంఘానికి అధికార, విపక్ష పార్టీలు సమానమని అన్నారు.
READ MORE: Rahul Gandhi: కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీలో లక్షకు పైగా ఓట్లు చోరీ అయ్యాయి!
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
18ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని, పౌరుల మధ్య ఈసీ విపక్ష చూపదని అన్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదని, బీహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తుపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నికల సంఘం పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. బీహార్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉందని, తమ బాధ్యత నుంచి వెనక్కి వెళ్లలేదని వెల్లడించారు. తమపై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదుని, ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి లోపాలను తొలగించడంలో ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. ముసాయిదా జాబితాలోని క్లెయిమ్లు, అభ్యంతరాల సమయం ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉందని, గడువు తీరడానికి ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలోని లోపాలను అన్ని రాజకీయ పార్టీలు ఫారమ్ కింద సమర్పించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ద్వారాలు అందరికీ సమానంగా తెరిచి ఉన్నాయని స్పష్టం చేశారు.
జిల్లా అధ్యక్షుడు, బీఎల్ఏల ధృవీకరణ జాతీయ పార్టీకి చేరకపోవడం, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగించే విషయని అన్నారు. బీహార్లోని 7 కోట్లకు పైగా ఓటర్లు ఎన్నికల కమిషన్కు మద్దతు ఇస్తే, ఈసీ విశ్వసనీయతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలో మెరుగుదల కోరుతున్నాయని, ఈ డిమాండ్ను నెరవేర్చడానికి బీహార్ నుంచి SIR ప్రారంభించినట్లు తెలిపారు. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తప్ప మరే ఇతర అంశంపైనా ఎన్నికల కమిషన్ అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అనేది జరగదు. కానీ ఈ రోజు ఈసీ మొదటి సారి సమావేశం నిర్వహించింది.
READ MORE: Hyderabad :కార్మికుల సమ్మెపై చిరంజీవితో నిర్మాత సి.కల్యాణ్ కీలక చర్చ!
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!