Chirag Paswan: నితీష్ సర్కార్కు మద్దతు ఇవ్వడం బాధగా ఉంది.. బీజేపీ మిత్రపక్షం ఆగ్రహం..
- బీహార్ నేరాలపై ఎన్డీయే కూటమిలో విభేదాలు..
- నితీష్ కుమార్ పాలనపై చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం..
- ఇలాంటి ప్రభుత్వానికి బాధతో మద్దతు ఇస్తున్నానని విచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎన్డీయేలోని మిత్రపక్షాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల, బీహార్ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించిన సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా, అంబులెన్స్లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. నేరకార్యకలాపాలు పెరగడంపై చిరాగ్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి, ఇలాంటి ప్రభుత్వానికి నేను మద్దతు ఇస్తున్నందుకు బాధగా ఉంది. నేరాలను నియంత్రించడం తప్పనిసరి, లేకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. నేరాలు ఇక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది’’ అని అన్నారు.
Also Read
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
Read Also: Manipur: మణిపూర్లో భారీగా గన్స్, బుల్లెట్స్, గ్రెనేడ్స్ స్వాధీనం..
‘‘రాష్ట్రంలో హత్య, అత్యాచారం, సామూహిక అత్యాచారం, దోపిడీ, దోపిడీ, దొంగతనం, ఈవ్ టీజింగ్ వంటి వరుస నేరాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. చర్యలు మరియు అరెస్టులు జరిగినప్పటికీ, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ’’అని చెబుతూ, పరిపాలన నేరస్థుల ముందు తలవంచిందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే లక్ష్యంతో జరిగినా, వాటిని ప్రభుత్వం వెంటనే ఆపాలని కోరారు. ఇందులో ప్రభుత్వం హస్తం ఉంది లేదా ఈ సంఘటనలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆలస్యం కాకముందే చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ఇటీవల, బీహార్లో పలు హైప్రొఫైల్ మర్డర్స్ జరిగాయి. గత 30 రోజుల్లో పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రాను ఐదుగురు సాయుధులు హత్య చేశారు. పాట్నాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ నేత గోపాల్ కేమ్కాను హత్య చేశారు. పాట్నాలోనే ఇసుక వ్యాపారి రమాకాంత్ యాదవ్ హత్యకు గురయ్యాడు. కిరాణా వ్యాపారి విక్రమ్ ఝా కూడా హత్య చేయబడ్డాడు. శుక్రవారం, హోంగార్డ్ పరీక్ష కోసం వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్లో సామూహిక అత్యాచారం చేశారు.
తాజావార్తలు
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!