వ్యాపార కేంద్రంలో బాంబ్ పేలడంతో ఒకరు మృతి చెందిన ఘటన పాకిస్థాన్ కరాచీలోని ఖరద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ పేలుడు సోమవారం రాత్రి సంభవించింది. ఇందులో ఓ పోలీసు ఆఫీసర్ తో పాటు దాదాపు 12 మంది వ్యక్తులకు గాయాలైనట్లు అధికారు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో.. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ పేలుడు కోసం దుండగులు మోటారు…
పాకిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు సిక్కు వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో సల్జీత్ సింగ్ (42), రంజీత్ సింగ్ (38) వ్యాపారం చేస్తుంటారు. అయితే.. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని అయిన పెషావర్లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తుంటారు. వారిలో అత్యధికులు వ్యాపారులే ఉండగా.. వీరిపై దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హకీం, అంతకుముందు ఏడాది ఓ…
అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇప్పటికే ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కానీ.. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీం కింద కేంద్రంను అనుమతులు కోరింది ఫోర్డ్. అయితే.. ఇటీవలే ఫోర్డ్ పీఎల్ఐ అప్లికేషన్కు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫోర్డ్ మళ్లీ ఇండియాలో కార్ల ఉత్పత్తి కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, భారత్లో విద్యుత్ కార్ల తయారీ…
నల్లమల్ల అభయారణ్యం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెలతీర్థం జలపాతం వద్ద వ్యక్తిని చంపిన ఘటన కలకలం రేపింది.. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందినా సాయి తేజ చెడు అలవాట్లకు బానిసై, తనను పెంచిన తల్లి భూలక్ష్మిని ఈ నెల 6వ తేదీన అతికిరాతకంగా హతమార్చాడు.. అంతేకాకుండా.. ఇంట్లో సొమ్ములు, డబ్బులు తీసుకొని అతని స్నేహితుడు వట్టికోట శివతో కలిసి 10వ తేదీన శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో నాగర్…
ఇండియాలోని వింతల్లో ఆగ్రాలోని తాజ్మహల్ది ప్రత్యేక స్థానం. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఈ తాజ్మహాల్ను నిర్మించారన్నది చరిత్ర. అయితే.. షాజహాన్ తాజ్మహాల్ నిర్మించడానికి ముందే అక్కడ శివాలయం ఉండేదని మరోకొందరి వాదన. ఈ నేపథ్యంలోనే తాజ్మహల్లో రెండు అంతస్థుల్లో ఉన్న 22 మూసిఉన్న గదులను తెరువాలని, దానిపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేయాలని.. అప్పుడే అందులో ఉన్న రహస్యం బయట పడుతుందని బీజేపీ యూత్ మీడియా ఇంఛార్జ్ రజ్ నీష్ సింగ్ అలహాబాద్ హైకోర్ట్ లో…
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వినాయకనగర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట వినాయక నగర్లో ఉన్న జ్యూయల్ గ్రాండ్ అపార్ట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. లలిత (56) దివ్య (32) శివ కార్తికేయ (వన్ అండ్ ఆఫ్ ఇయర్) ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే.. లలిత, శివ అక్కడికి అక్కడే మృతి చెందగా.. దివ్య పరిస్థితి…
యుక్తవయసులో బైక్అంటే అందరికీ ఇష్టమే.. బైక్పై స్నేహితులకు ఎక్కించుకొని షికారు కొట్టాలనే సహజం. అయితే 18 సంవత్సరాలు నిండిన తరువాతే బైక్ డ్రైవింగ్, కారు డ్రైవింగ్కు అర్హులు. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెట్టి కొందరు యువకులు డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల పొగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. మహమ్మద్ అనే పదో తరగతి విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్పై వెళుతున్నాడు. ఆ బైక్ను కూడా ఇంట్లో వాళ్లకు తెలియకుండా బయటకు తీసుకువచ్చాడు. అయితే.. మహమ్మద్ నడుపుండగా..…
ఏపీలో టెన్త్ పేపర్ల లీకులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షల్లో సంస్కృతం ప్రశ్నాపత్రానికి బదులుగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాలను సూర్యాపేటలో విద్యార్థులకు ఇచ్చారు. తీరా పరీక్ష రాసేందుకు సిద్దమైన విద్యార్థులు సంస్కృతంకు బదులు కెమిస్ట్రీ పేపర్ చూసి షాక్కు గురయ్యారు. దీంతో గంటన్నర ఆలస్యంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. నేడు మరో పొరపాటును చేసింది ఇంటర్…
ప్రభుత్వ రంగం, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. పెద్ద మొత్తం డిపాజిట్ల(రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ)పై వడ్డీ రేటును 40- 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లు మినహా అన్ని డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్బీఐ సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు…
హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని టవర్లను, డేటా…