సోమవారం రాత్రి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మేస్రం కులస్తుల ధార్మిక, సాంస్కృతిక సంబంధమైన వార్షిక నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మేస్రం పెద్దలు మరియు పూజారుల ప్రకారం, ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని రాత్రి 10 గంటలకు ప్రారంభించేందుకు వంశంలోని సభ్యులు మహాపూజ, తరువాత సాతీక్ పూజ నిర్వహిస్తారు. వారు బుధవారం పెర్సపెన్ మరియు బాన్పెన్ పూజలను నిర్వహిస్తారు. జాతరలో భాగంగా భేటింగ్, కొత్త కోడళ్ల పరిచయం, మందగజిలి పూజ,…
న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో పెగాసస్ దుమారం మరోసారి రేగింది. ఈ స్పైవేర్ ను భారత్ 2017లో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యంగ్యం ప్రదర్శించారు. పెగాసస్ స్పైవేర్ లో కొత్త వెర్షన్ లు ఏమైనా వచ్చాయేమో ఇజ్రాయెల్ ను కనుక్కోండి… ఇదే తగిన సమయం అంటూ సెటైర్ వేశారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల సంబంధాల్లో కొత్త లక్ష్యాలు ఇప్పుడు నిర్దేశించుకోవచ్చు…
తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాల పట్ల ఆకర్షితులై దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అలాంటి తొలి ప్రయత్నంగా శనివారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలిసి రైతు సంఘాల నేతలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వినతిపత్రం సమర్పించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేయడంతోపాటు వ్యవసాయ…
ద్వైవార్షిక ఉత్సవాల సందర్భంగా సమ్మక్క-సారలమ్మ దేవతలను పూజించేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC), మంచిర్యాల డివిజన్ నుండి ములుగు జిల్లా మేడారంకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది. కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ ఎం.మల్లేశయ్య ఆదివారం బస్సు సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశయ్య మాట్లాడుతూ.. జాతరలో పాల్గొనే భక్తులను మేడారం తరలించేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మంచిర్యాలలో ఒక బస్సు బయలుదేరుతుందని,…
ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్ద షాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఐపీఎస్, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మై హోమ్…
వరంగల్ నగరానికి ప్రతీకగా వున్న భద్రకాళీ అమ్మవారి దేవాలయ పరిసరాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే భద్రకాళీ బండ్ ను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అలాగే బండ్ పై జరుగుతున్న పనులనుకూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బండ్ పై కలియ తిరిగి సందర్శకుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు. బండ్ ఆధునీకరణ ఎలా వుంది?…
విజయవాడలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు, సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటునట్లు తెలిసింది. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అయితే ఆత్మహత్య…
మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని ఆయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల…
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నర్సంపేట…
పీఆర్సీపై ఏపీలో దుమారం రేగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పీఆర్సీ పై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం వద్దు కానీ.. ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ప్రమోషన్లు తక్షణం చేపట్టాలని అన్నారు. ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పేరు…