తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యులుగా మేమంతా ఆరోజు పోరాడాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. నిరుద్యోగ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఒకే కులానికి మంత్రి పదవులు ఉన్నాయని, ఇతర కులాలకు పనికిరాని పదవులు ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు..ఉద్యోగాలు అక్కడ లేవు..ఇక్కడ లేవు.. ఉద్యోగాలు వచ్చే వరకు…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగసంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే పలుమార్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను పీఆర్సీపై చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే ఇప్పటివరకు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మంత్రుల కమిటీతో…
వైసీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మహిళా ద్రోహి అంతో వంగలపూడి వనిత ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ళుగా సీఎంలో మార్పు వస్తుందని ఆశించామని ఆమె అన్నారు. పాదయాత్ర లో ముద్దులు పెట్టిన సీఎం జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నారని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని, ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు.…
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న డ్రిల్మెక్.. 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్మెక్. డ్రిల్మెక్ సీఈవో అలెక్స్కు MoU కాపీని పరిశ్రమలు, ఐటిశాఖ…
కాన్పూర్లోని టాట్ మిల్ క్రాస్రోడ్ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకువచ్చిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో 15 మంది పాదచారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. టాట్ మిల్ ఇంక్లైన్లో బస్సు బ్రేక్లు పనిచేయకపోవడంతో కార్లు, బైకులు, పాదచారులను ఢీకొట్టాయని కాన్పూర్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రమోద్ కుమార్ తెలిపారు. 9 మంది…
వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా అడవుల్లో మంటలు చెలరేగడం సర్వసాధారణం. అయితే ఈ మంటలు తీవ్రమైన నష్టాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) తన పరిమితుల్లో అడవి మంటలను నిరోధించడానికి, నియంత్రించడానికి ఈ సంవత్సరం స్థానిక చెంచులలో రోపింగ్, వారి సేవలను ఉపయోగించుకోనుంది.ముందుగా ఫైర్ లైన్ల నిర్వహణ, ఇతర అంశాలపై స్థానిక చెంచులకు అవగాహన కల్పిస్తున్నారు. దీని కోసం, ATR రిజర్వ్ ఫారెస్ట్లోని సంబంధిత పెంటాస్ (గ్రామాలు)లో పని చేయడానికి సీజన్లో చెంచులను తాత్కాలికంగా నియమిస్తోంది. సాధారణంగా,…
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క జాతర తెలంగాణకే తలమానికం. అయితే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మేడారం జాతర సందర్బంగా వేములవాడ రాజన్న దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా..…
ప్రేమ గుడ్డిదని పలువురు అంటుంటే విని ఉంటాం.. ప్రేమ మైకంలో తప్పని తెలిసినా కొందరు చెడు దారులు తొక్కుతూ.. వారి అందమైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అంతేకాకుండా వారిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరాన శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటును చేసుకుంది. మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే డ్రగ్స్ కు ప్రియుడు అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి డ్రగ్స్…
పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే భూకబ్జా, రెవెన్యూ ఉద్యోగులపై దౌర్జన్యం కేసులో పరారీలో ఉన్న వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 3 రోజులుగా దొడ్డి కిరణ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. రాజమండ్రిలో దొడ్డి కిరణ్ ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం దొడ్డి…
8 సంవత్సరాల వయస్సులో విరాట్ చంద్ర తేలుకుంట ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. హైదరాబాద్కు చెందిన మూడవ తరగతి విద్యార్థి కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఒకరైనందుకు, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2022ను అందుకున్నారు. ఎనిమిదేళ్ల చిన్నారి తన కోచ్ భరత్ తమ్మినేనితో కలిసి మార్చి 6, 2021న నగరంలో 75 రోజుల పాటు కఠోర శిక్షణ పొందిన తర్వాత ఆఫ్రికన్ పర్వత శిఖరానికి చేరుకున్నాడు. “నాకు ఈ అవార్డు లభించినందుకు నేను…