కాంగ్రెస్ పార్టీకి తాము చేసే పాదయాత్రలకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఏ గ్రామం వెళ్లినా అప్పటి కాంగ్రెస్ పాలను గుర్తు చేస్తుకుంటున్నారు అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని భట్టి అన్నారు.
ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన కామెంట్స్ వల్ల మతకల్లోలానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు.