MLA Seethakka : పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం రఘునాధపురంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలన్నారు. ఉండడానికి ఇల్లు లేని ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఇంద్ర భవనాల లాంటి పరిపాలన భవనాలు కడుతున్నారని ఆమె మండిపడ్డారు. చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదల భూములను బలవంతంగా లాక్కొని వారి కీలక అనుచరులకు ప్రభుత్వం ఇస్తోందని ఆమె విమర్శించారు. పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని ఆమె ఉద్ఘాటించారు. నిరుపేదలకు ఇల్లు, వ్యవసాయ భూములు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఆమె కొనియాడారు. 5వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్న కేసీఆర్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వడం లేదన్నారు.
Also Read : Sita Ramam: ఈ ప్రేమకావ్యం చరిత్రలో నిలిచిపోతుంది…
Also Read
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
విద్యార్థులు కొలువులు రాక ఇబ్బందులు పడుతుంటే కేసిఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కట్టామని మట్లాడటం బాధాకరమన్నారు ఎమ్మెల్యే సీతక్క. నిజాం రాచరిక నియంతృత్వ నిరంకుశ మనస్తత్వం కలిగిన కేసీఆర్ను గద్దె దించటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్పూర్తితో ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Karnataka Elections : కర్ణాటకలో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!