Bhatti Vikramarka : రాష్ట్రంలో బానిసత్వం.. బాంచన్ దొర అనే సంస్కృతి.. మరోవైపు అణిచివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్క అక్క ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్న నష్టాన్ని ఆపడానికి, రైతులు నిరుద్యోగుల కష్టాలు తీర్చడానికి, ఇందిరమ్మ రాజ్యం కోసం… పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్నికలు వస్తున్నాయనో, వ్యక్తిగతంగా నాకోసమో ఈ యాత్ర చేయడం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ… ఆ సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల విధ్వంసాలను ఆపడం, నిలవరించడం కోసమే పీపుల్స్ మార్చ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సంపద ప్రజలకే ఉండాలని, రాష్ట్ర వనరులు రాష్ట్రానికే ఉండాలని… పీపుల్స్ మార్చ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read : Bholaa Shankar: ఇంద్రా తర్వాత ఇప్పుడే… మెగా సంభవం లోడింగ్
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
బీఆర్ఎస్ ప్రభుత్వము కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రజలకు భ్రమలు మాత్రమే కల్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని, బానిసత్వం.. బాంచన్ దొర అనే సంస్కృతి.. మరోవైపు అణిచివేత రాష్ట్రంలో కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. ఆనాటి నిజం చరిత్రకు, పరిపాలనకు.. ఈనాటి కేసీఆర్ పరిపాలనకు పెద్దగా తేడా లేదు అని స్పష్టంగా చెప్పగలనని, భావోద్వేగాల మధ్య తెలంగాణ తెచ్చుకుని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా.. ప్యాలెస్ లు నిర్మించడం వల్ల ఏం ప్రయోజనమన్నారు. ఆనాడు నిజం పాలనకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన పోరాటం ఎలా మొదలైందో.. అలాగే తెలంగాణలో ఇప్పుడు రైతులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాలు ఆందోళనకు సిద్ధమవుతున్నారని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే… అన్ని సమస్యలకు కాంగ్రెస్ పాలనలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు భట్టి. ఉద్యోగాల భర్తీ కోసం వార్షిక క్యాలెండర్ రూపొందిస్తామని, ఉద్యోగాల కల్పన కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. నిరుద్యోగ భృతి అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
Also Read : TV Channel: తెలుగు టీవీ ఛానల్లో అర్ధరాత్రి అశ్లీల వీడియోలు.. హ్యాక్ చేసి..
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!