Opposition Meeting: సిమ్లా కాదు బెంగళూర్.. నెక్ట్స్ విపక్షాల సమావేశంపై శరద్ పవార్ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Meeting: విపక్షాల ఐక్యతపై ఈ నెల 23న పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మొత్తం 17 పార్టీలు సమావేశమయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు ఐక్యంగా పోటీ చేయాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. అయితే దీనికి సంబంధించిన విధివిధానాలు వచ్చే సమావేశంలో నిర్ణయించబడతాయని విపక్షాలు పేర్కొన్నాయి.
ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే నెల రెండో వారంలో సిమ్లా వేదికగా విపక్షాల సమావేశం జరుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. అయితే ఈ వేదిక ఇప్పుడు బెంగళూర్ కు మారింది. జూలై 13-14 తేదీల్లో బెంగళూర్ వేదికగా ప్రతిపక్ష పార్టీ నేతల తదుపరి సమావేశం నిర్వహించబోతున్నట్లు ఎన్సీపీ నేత శరద్ పవార్ గురువారం తెలిపారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Akkineni Nagarjuna: కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న నాగ్.. ఎన్ని లక్షలో తెలుసా.. ?
గతంలో జూన్ 23న జరిగిన సమావేశంలో కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద ఆర్డినెన్స్ను కాంగ్రెస్ పార్టీ ఖండించి, ఆప్ కు మద్దతు తెలిపే వరకు భవిష్యత్తులో కాంగ్రెస్తో కూడిన ప్రతిపక్ష సమావేశాల్లో తాము పాల్గొనబోమని ఆప్ తెలిపింది. అయితే ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చర్చించలేదని పవార్ ఇటీవల తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్ తో, హేమంత్ సొరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రేలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశాన్ని ఫోటో సెషన్ గా అమిత్ షా అభివర్ణించారు. కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీని ఓడించలేదని బహిరంగంగా ఒప్పుకుందని స్మృతి ఇరానీ విమర్శించారు. అసలు ప్రధాని అభ్యర్థి ఎవరనేది ముందు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!