Opposition meeting: జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో విపక్ష నేతల రెండో సమావేశం.. స్పష్టం చేసిన కాంగ్రెస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య విపక్షాల రెండో సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సన్నాహకానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల సమావేశం రెండోసారి నిర్వహిస్తుంది.
Bandla Ganesh: గురు పూర్ణిమ.. దూరంగా ఉంటా అంటూ బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
అంతకుముందు సమావేశానికి సంబంధించి జనతాదళ్ యునైటెడ్ (జెడియు) నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. వచ్చే వారం బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల ముఖ్యమైన సమావేశం వాయిదా పడిందని.. వర్షాకాల సమావేశం తర్వాతకు వాయిదా వేసినట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత.. సమావేశానికి సంబంధించి కొత్త తేదీ నిర్ణయించబడుతుందని తెలిపారు. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా ఈ సమావేశంపై ANIతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల సమావేశం 2 నుంచి 4 రోజులు ఆలస్యం కావచ్చని.. లేదా ముందుగానే నిర్వహించవచ్చు అని తెలిపారు. చాలా మంది నేతలు బిజీగా ఉండటంతో.. ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Anushka: నవ్వి నవ్వి ఏడుస్తారు… టిష్యూస్ తెచ్చుకోండి… మాములుగా ఉండదు
బీహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే వారం జూలై 10న నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు జూలై 24 వరకు కొనసాగనున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇద్దరూ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటారు. అందువల్ల సమావేశాన్ని వాయిదా వేయాలని నితీష్ కుమార్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం శనివారం మాట్లాడుతూ.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమవుతాయని.. ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని చెప్పారు. 23 రోజుల పాటు జరిగే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 23 సభలు జరగనున్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!