Husband and Wife Case: ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి భార్య భర్తలు గొడవ పడుతున్న నేపథ్యంలో చాలామంది విడాకులు తీసుకున్నంత వరకు వెళ్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరగగా.. అందుకు సంబంధించి భార్య పెట్టిన కేసు పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగం రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లి…
బెంగళూరులోని హెగ్గనహళ్లి క్రాస్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్ కళాశాల సమీపంలో ఆగి ఉన్న ఐదు బస్సుల్లో మంటలు చెలరేగాయి.
లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్-సెక్యులర్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ను కర్ణాటకలోని బెంగళూరులోని ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టు బుధవారం తిరస్కరించింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవణ్ణపై కర్ణాటకలోని హోలెనరసిపురా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఏదైనా హోటల్కు గానీ.. లేదంటే రెస్టారెంట్కు గానీ వెళ్లినప్పుడు తాజాగా.. వేడి వేడిగా ఏవైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని ఆశించి వెళ్తుంటాం. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక చల్లని ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎవరూ ఇష్టపడరు.
కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Snake In Amazon Order: బెంగళూరు ( Bengaluru )లోని ఓ జంట ఆదివారం అమెజాన్ లో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన దంపతులిద్దరూ ఆన్లైన్ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ చేశారు. అయితే వారికి అమెజాన్ ప్యాకేజీలో ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యారు. విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్కు అంటుకపోవడంతో హాని కలిగించలేదు. ఇందుకు సంబంధించి ఆ జంట ఓ వీడియోను…
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. మృతురాలు కోలారు జిల్లా శ్రీనివాసపూర్కు చెందిన పవన అనే విద్యార్థినిగా గుర్తించారు
తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జూన్ 17వ తేదీన సిఐడి ముందు హాజరవుతానని బీజేపీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్ప జూన్ 15 శనివారం తెలిపారు. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ సీఎం బెంగళూరులో అన్నారు. పోక్సో కేసుకు సంబంధించి యడ్యూరప్పను అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు శుక్రవారం సీఐడీని నిలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట జూన్ 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్…
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు…